ధర్పల్లి, అక్టోబర్ 3 : ప్రయాణికులకు మెరుగైన సేవలందించి ఆర్టీసీని మరింత అభివృద్ధి చేస్తామని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ధర్పల్లిలో సోమవారం పర్యటించిన ఆయన.. ధర్పల్లి బస్టాండ్, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్ పక్కన అటవీశాఖ కార్యాలయ స్థలాన్ని గ్రామ పంచాయతీకి అప్పగించగా.. బస్టాండ్ అభివృద్ధి, అంగడిబజార్ విస్తరణ, యార్డుల ఏర్పాటు తదితర పనులపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఆర్టీసీ బస్టాండ్, అంగడిబజార్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే వెంట ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పీసు రాజ్పాల్రెడ్డి, ధర్పల్లి సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్రాజ్, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు నల్ల హన్మంత్రెడ్డి, నాయకులు సురేందర్గౌడ్, వెంకట్రెడ్డి, శ్రీనివాస్నాయక్, శ్రీనివాస్, గోపాల్, గోపాల్నాయక్, సుభాష్, గ్రామస్తులు ఉన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన ప్రజాప్రతినిధులు
రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను నిజామాబాద్లోని ఆయన నివాసంలో రూరల్ జడ్పీటీసీ సభ్యురాలు బొల్లెంక సుమలతాగోపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుకర్రావులతో పాటు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు సోమవారం కలిశారు. గ్రామాల్లోని సమస్యలపై వినతిపత్రాలను అందజేశారు. విపక్షాల దుష్ప్రచారాలను టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. టీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించి సీఎం కేసీఆర్ నేతృత్వంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తెలిపారు.
రూ.2.50 లక్షల ఎల్వోసీ అందజేత
జక్రాన్పల్లి మండలకేంద్రానికి చెందిన మంగలి వంశీకృష్ణ అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరు చేయించిన రూ. 2 లక్షల 50 వేల ఎల్వోసీని వంశీకృష్ణ కుటుంబానికి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం అందజేశారు. అంనతరం మునిపల్లి గ్రామానికి చెందిన పలు బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరార్శించారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్మోహన్, ఎంపీపీ కుంచాల విమలాజు, వైస్ ఎంపీపీ తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఢీకొండ శ్రీనివాస్, సర్పంచ్ చంద్రకళ, ఉపసర్పంచ్ జక్కం బాలకిషన్, ఎంపీటీసీలు గడ్డం గంగారెడ్డి, సతీశ్, సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు అక్బర్ఖాన్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.