వేల్పూర్, సెప్టెంబర్ 30 : వేల్పూర్ మండలంలోని పెద్ద వాగు, కప్పల వాగు చిన్నపాటి వర్షాలకే పారి వేల్పూర్-రామన్నపేట్, వేల్పూర్-పచ్చల నడుకుడ మధ్య రోజుల తరబడి రాకపోకలు నిలిచి పోయే పరిస్థితి ఉండేది. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాతే వారిధి వెతలు తీరాయి. 60 ఏండ్లు పాలించిన వారు వాగుల మీద బ్రిడ్జిల నిర్మా ణ ఆవశ్యకతను పట్టించుకోలేదు. కానీ 2014లో తెలంగాణ సర్కారు వచ్చాక వాగుల మీద కష్టాలు మాయమయ్యాయి. వారంరోజుల పాటు ఎడ తెరిపి లేకుండా రికార్డు స్థాయిలో వర్షాలు కురిసి నా.. వాగుల్లో వరద పొటెత్తినా ఈ గ్రామాల మధ్య రాకపోకలు ఆగలేదు. కేసీఆర్ సర్కారు వచ్చాక వాగు లు భారీగా పారినా రాక పోకలు ఆగడం లేదనడానికి ఈ గ్రా మాల మధ్య వంతెనలు నిదర్శంగా నిలుస్తు న్నాయి. ఈ వాగు ల మీద వంతెనలు లేక జనం ఇబ్బందులను తన బాల్యం నుంచే చూసిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యతతో ఈ వంతెనల నిర్మాణానికి కృషి చేశారు. దీంతో ఎన్నో గ్రామాల ప్రజల ఇబ్బందులు తీరిపోయాయి.
రామన్నపేట్-వేల్పూర్ వంతెన
వేల్పూర్ మండల కేంద్రం, మండలంలోని రామన్నపేట్ గ్రామాల మధ్య కప్పలవాగు ప్రవహిస్తుంటే ఇరు గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయేవి. ఈ వాగు గుండా మోర్తాడ్ మండలంలోని పలు గ్రా మాల వారి రాక పోకలూ బంద్ అయ్యేవి. వంతెన కావాలని ఈ గ్రామాల వారు గత పాలకులకు మొరపెట్టుకు న్నా ఫలితం లేక పో యింది. 2014 త ర్వాత రూ.7 కోట్లతో భారీ వంతెన నిర్మించారు.
పచ్చల నడుకుడ-వేల్పూర్ వంతెన
ఈ రెండు గ్రామాల మధ్య పెద్దవాగు వానకాలం ఉధృతం గా ప్రవహిస్తూ ఉం టుంది. దీంతో మండల కేంద్రం వేల్పూ ర్, పచ్చల నడుకుడ తో పాటు.. మండలంలోని అంక్సాపూర్, పడగల్, అమీనాపూర్,సాహెబ్ పేట్ వారు.. పచ్చల నడుకుడ, జాన్కంపేట్ గ్రామాల వారికి రాకపోకలు బంద్ అయ్యేవి. కేసీఆర్ వచ్చాక రూ.6 కోట్లతో పెద్ద వంతెన నిర్మించారు.
నిర్మాణంలో మోతె, వేల్పూర్ భారీ వంతెనలు
వేల్పూర్ పెద్ద వాగు, మోతె పెద్ద వాగు భారీ వర్షాల సమయంలో నిండుగా పారుతూ తరచూ రాక పో కలు నిలిచేపోయిన సందర్భాలు ఉన్నాయి. 60 ఏండ్ల పాలనలో అప్పటి వారు ఈ వాగుల కష్టాలు గట్టెక్కించే ఆలోచనే చేయలేదు. 2014 తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన అనతి కాలంలోనే దీని పై దృష్టి సారించిన మంత్రి వేముల మోతె వాగు పై రూ.12 కోట్లతో, వేల్పూర్ వాగు పై రూ.15 కోట్లతో హైలెవెల్ వంతెనలు మంజూరు చేయించారు. ప్రస్తుతం వాటి నిర్మాణం జరుగుతున్నది. త్వరలోనే ఈ వారధులు అందుబాటు లోకి రానున్నాయి.
పడగల్ బ్రిడ్జి తీరనున్న భయం
63వ నంబరు జాతీయ రహదారి నుంచి వేల్పూర్ మండలం పడగల్ వెళ్లే బీటీ రోడ్డు కిందగా ఉధృతంగా పారే పడగల్ చెరువు అలుగు కాలువ ప్రమాదకరంగా ఉండేది. గతంలో భారీ వర్షాల సమయంలో ఈ కాలువ మీదుగా ఉన్న పాత బ్రిడ్జి మీదుగా ప్రయాణిస్తున్న కారు వరద ధాటికి కొట్టుకు పోయి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన అనుభవంతో ఇక్కడ రూ.2.5 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేయించారు మంత్రి వేముల. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా శరవేగంగా కొనసా గుతున్నాయి.
వాగు ఎంత పారినా వేల్పూర్ చేరుడే..
గతంలో కప్పల వాగు పారితే వేల్పూర్ వెళ్లలేక పోయే వాళ్లం. ఈ వాగుపై వంతెన నిర్మాణం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. కానీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో భారీ వంతెన కట్టారు. ఇప్పుడు వాగు ఎంత పారినా వేల్పూర్ వెళ్తున్నాం.
-శోభన్, రామన్నపేట్
వారధితో బాధలు తీరాయి
పచ్చల నడుకుడ-వేల్పూర్ మధ్యనే కాకుండా వాగుకు రెండు వైపులా ఉన్న పలు గ్రామాల మధ్య ఎంత వరద వచ్చినా కొత్త బ్రిడ్జితో రాకపోకలు ఆగే ముచ్చటనే లేదు. సీఎం కేసీఆర్, మంత్రి వేముల చేసిన ఈ మేలును ఈ గ్రామాల వారు మరువరు. మొన్నటి వానల్లో బ్రిడ్జి లేని రోజుల్లో పడ్డ కష్టాలు గుర్తుకు వచ్చాయి.
-నల్ల రమేశ్, పచ్చల నడుకుడ