పసుపుబోర్డు.. నిజామాబాద్ రైతుల దశాబ్దాల కల. దాన్ని సాకారం చేసేందుకు టీఆర్ఎస్ తీవ్రంగా కొట్లాడితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బోర్డు ఇవ్వకుండా మొండికేసింది. మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చినా, ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక రైతులను దగా చేసింది. ప్రధానంగా పసుపుబోర్డు ఏర్పాటుకు అడ్డు పడింది నాటి కేంద్ర వాణిజ్య, నేటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే అన్నది బహిరంగ సత్యం.
ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న నిర్మలమ్మ ముందుగా పసుపుబోర్డు అంశాన్ని తేల్చాలని రైతులు నిలదీస్తున్నారు. ఎంపీగా కల్వకుంట్ల కవిత కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకు రాగా, బోర్డు ఏర్పాటుకు అడ్డు పడింది మీరు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. రైతులకు మేలు చేయకపోగా, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర విత్త మంత్రి వింత ఆరోపణలు చేయడంపై పసుపు రైతులు మండిపడుతున్నారు.
నిజామాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పసుపుబోర్డు.. నిజామాబాద్ రైతుల దశాబ్దాల కల. దాన్ని సాకారం చేసేందుకు టీఆర్ఎస్ తీవ్రంగా కొట్లాడితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బోర్డు ఇవ్వకుండా మొండికేసింది. మేనిఫెస్టోలోనూఈ అంశాన్ని చేర్చినా, ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక రైతులను దగా చేసింది. ప్రధానంగా పసుపుబోర్డు ఏర్పాటుకు అడ్డు పడింది నాటి కేంద్ర వాణిజ్య, నేటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే అన్నది బహిరంగ సత్యం.
ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న నిర్మలమ్మ ముందుగా పసుపుబోర్డు అంశాన్ని తేల్చాలని రైతులు నిలదీస్తున్నారు. ఎంపీగా కల్వకుంట్ల కవిత కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకు రాగా, బోర్డు ఏర్పాటుకు అడ్డు పడింది మీరు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. రైతులకు మేలు చేయకపోగా, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర విత్త మంత్రి వింత ఆరోపణలు చేయడంపై పసుపు రైతులు మండిపడుతున్నారు.
దేశంలో పసుపు సాగుచేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందున్నది. అత్యధిక సాగు విస్తీర్ణంతోపాటు భారీ ఉత్పత్తి కూడా మన సొంతం. తెలంగాణలో లక్షా 37వేల ఎకరాల్లో పసుపు పంట సాగవుతున్నది. తమిళనాడులో 45,209 ఎకరాలు, వెస్ట్ బెంగాల్లో 43,764 ఎకరాలు, కర్ణాటకలో 43,895 ఎకరాలు, అస్సాంలో 40,890 ఎకరాలు, మహారాష్ట్రలో 35,857 ఎకరాల్లో సాగవుతున్నట్లుగా కేంద్ర సర్కారు వెల్లడించిన గణాంకాలే చెబుతున్నాయి.
తెలంగాణలో భారీగా పసుపు పంట సాగవుతుండగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటుకు మోకాలడ్డుతున్నది. 2014 నుంచి టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత సుదీర్ఘ పోరాటం చేశారు. ప్రధాని మోదీని కలిసి పసుపు బోర్డు ఏర్పాటుపై వినతిపత్రాలు అందించారు. నాటి వాణిజ్య మంత్రి, నేటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి అనేక విజ్ఞప్తులు చేశారు.
నిజామాబాద్ ఎంపీగా కవిత చేసిన పోరాటానికి స్పందించిన కేంద్రం ఒక మెట్టు దిగి స్పైసెస్ బోర్డు ద్వారా ఎక్స్టెన్షన్ కార్యాలయం ఏర్పాటు చేస్తామంటూ ప్రకటన చేసింది. పసుపు బోర్డు ఒక్కటే పరిష్కారమని టీఆర్ఎస్ ఎంపీగా కవిత కొట్లాడగా నిర్మలా సీతారామన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి ఇప్పుడు ఉమ్మడి జిల్లా పర్యటనలో నోటికొచ్చినట్లు మాట్లాడుతుండడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
పసుపులో అనేక ఔషధగుణాలున్నాయి. ఇది లేని వంటకం ఉండదు. ఏ శుభకార్యానికైనా తప్పనిసరిగా వినియోగిస్తారు. ప్రస్తుతం ఈ పంటను పండించిన రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. అధిగ దిగుబడినిచ్చే మేలిమి విత్తనాలు అందజేస్తే దిగుబడులు పెరిగి ప్రయోజనం చేకూరుతుంది. పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. ఐదేండ్లుగా పసుపు ధర పూర్తిగా పడిపోవడంతో సాగుపై విముఖత పెరిగే పరిస్థితి దాపురిస్తున్నది.
పత్తి, కంది, మక్కజొన్న, మినుము, పెసర, వరి, శనగ పంటల వైపు రైతుల దృష్టి మళ్లుతున్నది. పసుపు బోర్డు స్థాపనతో పసుపు పంటకు ప్రోత్సాహం లభిస్తుందన్న గంపెడంత ఆశతో కర్షకులు ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అది నెరవేర్చకపోవడంతోపాటు పూటకో మాట మాట్లాడడం సరికాదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న బీజేపీ హామీకి అతీగతీ లేదు. పైగా గత తమిళనాడు ఎన్నికల్లో పసుపు బోర్డు హామీని ఏకంగా బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టడం విడ్డూరం. రాజకీయ స్వలాభం కో సం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందనడానికి ఇదొక్కటే ఉదాహరణగా నిలుస్తున్నది.
రాష్ట్రంలో పసుపు పంటకు పెట్టింది పేరు నిజామాబాద్ జిల్లా. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో సాగయ్యే పసుపు పంటకు డిమాండ్ దక్కాలంటే పసుపు బోర్డు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. రైతులకు సాగులో మెళకువలు, శాస్త్రీయబద్ధమైన సలహాలు, సూచనలతోపాటు కొత్త వంగడాల సృష్టివంటివన్నీ బోర్డు ద్వారానే సాధ్యమవుతాయి.
పసుపు రైతులకు ఎలాంటి విపత్తు సంభవించినా బోర్డు ద్వారా కష్టాలు తీరే వీలు దక్కుతుంది. అందుకే దశాబ్దాలుగా ఇందూరు రైతులు ఈ డిమాండ్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పసుపు అత్యధికంగా పండించే ప్రాంతంలో పసుపు బోర్డు మాత్రమే కావాలంటూ రైతులు చెబుతున్నారు. బీజేపీ ఎంపీ అర్వింద్ మాత్రం స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయంతోనే మేలు జరుగుతుందంటూ చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారు. స్పైసెస్ బోర్డు అన్నది సుగంధ ద్రవ్యాలకు సంబంధించింది.
అలాంటి ఉత్పత్తులేవీ మన రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాలో సాగుకు నోచుకోవు. పసుపు పంటకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో స్పైసెస్ బోర్డుతోనే మేలు జరుగుతుందని బీజేపీ వాదిస్తుండడంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీస్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ ఏర్పాటు ప్రక్రియ కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేమీ కాదు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం 2014లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంపీ కల్వకుంట్ల కవిత పోరాటానికి దక్కిన ఫలితమిది. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 80వేల ఎకరాల్లో పసుపు పంట సాగవుతున్నది. అదనంగా నిర్మల్ జిల్లాలోనూ పసుపు సాగు జోరుగా ఉంటుంది.
ఈ ప్రాంతంలో పండే పసుపు పంటకు కేరాఫ్ అడ్రస్గా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ నిలుస్తుంది. రవాణాకు అనువుగా ఉండే నిజామాబాద్లోనే పసుపు రైతుల మేలు కోసం బోర్డు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత కర్షకులు గడిచిన 2 దశాబ్ధాలుగా పోరాటం చేస్తున్నారు. రైతుల కోరికను నెరవేర్చేందుకు ఎంపీగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంపై కవిత తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. పలుమార్లు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి బోర్డు కోసం విన్నవించారు.
నాటి వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2017లో కవిత విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని నిజామాబాద్లో స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ ఆఫీస్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించగా ఎంపీగా కవిత తిరస్కరించారు. అదే ప్రకటనను 2020, ఫిబ్రవరి 5న కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో ఎంపీ అర్వింద్ చెప్పించి జూలైలో ఎక్స్టెన్షన్ ఆఫీస్ ఏర్పాటు చేయించారు. పసుపు బోర్డు మాత్రం ఏర్పాటు కాలేదు.
పసుపు బోర్డు పేరుతో అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకొని బీజేపీ చేసిన మోసానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యక్ష సాక్షి. పసుపు బోర్డు ఇస్తామని రైతులకు ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలుసు. అటు తర్వాత పార్లమెంటు సమావేశాల్లో పసుపు బోర్డు ఇవ్వడం సాధ్యం కాదని ప్రకటన చేసింది నిర్మలా సీతారామనే. బోర్డు కోసం ఎంపీగా పార్లమెంటు లో పల, బయట అన్నిరకాలుగా రాజీలేని పోరా టం చేసిన కల్వకుంట్ల కవిత కృషిని, రైతుల ఆశలను నీరుగార్చేలా ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్ పసుపు రైతులకు సమాధానం చెప్పాలి.
-చొక్కాయి గంగారెడ్డి, రైతు, మోర్తాడ్
అర్వింద్ గారు పైలా హల్దీకి కిసానోంకు జవాబ్ దో. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న నాయకులను అబద్ధాల బాండ్ పేపర్ నాయకులు ప్రశ్నించడం విడ్డూరం. బాండ్ పేపర్లో తీసిన రాగమేంటి.. గెలిచాక పాడుతున్న పాటేంటి.. దీనికి ముందు అర్వింద్ సమాధానం చెప్పాలి.
– కొమ్ముల మోహన్ రెడ్డి, రైతు, ముప్కాల్