నిజామాబాద్ క్రైం, సెప్టెంబర్ 1 : సీఎం కేసీఆర్ ఈ నెల 5వ తేదీన నిజామాబాద్ రానున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు తెలిపారు. కామారెడ్డి ఎస్పీ బి.శ్రీనివాస్రెడ్డి, సంగారెడ్డి ఎస్పీ ఎం.రమణకుమార్తో కలిసి బందోబస్తు ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు.
హెలిప్యాడ్ స్థలంతో పాటు సీఎం ప్రారంభించనున్న నూతన కలెక్టరేట్, బహిరంగ స్థలం నిర్వహించే గిరిరాజ్ కళాశాల మైదానం, పార్కింగ్ కోసం పాలిటెక్నిక్ గ్రౌండ్, సీఎస్ఐ గ్రౌండ్, పోలీస్ పరేడ్ గ్రౌండ్ను పరిశీలించారు. వీటితో పాటు టీఆర్ఎస్ నూతన భవనాన్ని పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన చర్యలు, బందోబస్తుపై సిబ్బందితో చర్చించారు. సీపీ వెంట అదనపు డీసీపీ గిరిరాజు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఏసీపీలు ఏ.వెంకటేశ్వర్, ప్రభాకర్ రావు, కిరణ్ కుమార్, నారాయణతో పాటు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, సీఐలు చందర్రాథోడ్, జె.నరేశ్, కృష్ణ, ఎస్సైలు తదితరులు ఉన్నారు.