ఇందల్వాయి, ఆగస్టు 29 : మండలకేంద్రంతోపాటు మండలంలోని ఎల్లారెడ్లిపల్లి, నల్లవెల్లి, అన్సాన్పల్లి గ్రామాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు ఎమ్మెల్సీ వి.గంగాధర్గౌడ్.. ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ రమేశ్నాయక్తో కలిసి చెక్కులను అందజేశారు.
నల్లవెల్లికి చెందిన వనితకు రూ. 25 వేలు, అన్సాన్పల్లికి చెందిన నడ్పి గంగారానికి రూ. 10 వేలు, ఇందల్వాయికి చెందిన కన్నల నళినీబాయికి రూ. 30వేలు, ఎల్లారెడ్డిపల్లికి చెందిన రాజులుకు రూ.22 వేలు, ఒంటరి రవీందర్కు రూ.16 వేలు, గంగన్నకు రూ. 20 వేలు అందజేసినట్లు వివరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, సర్పంచులు నోముల విజయలక్ష్మారెడ్డి, గుర్రపు నరేశ్, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి పులి శ్రీనివాస్, ఎంపీటీసీలు మారంపల్లి సుధాకర్, శ్రీనివాస్గుప్తా, బాబురావు, సీనియర్ నాయకులు పాశం కుమార్, గడ్కోల్ శ్రీనివాస్, రామాగౌడ్, రత్న తదితరులు పాల్గొన్నారు.
ఖలీల్వాడి (మోపాల్), ఆగస్టు 29 : మోపాల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 23 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరయ్యాయి. ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ లబ్ధిదారుల ఇండ్లకు సోమవారం వెళ్లి చెక్కులను పంపిణీ చేశారు. కంజర, కులాస్పూర్, బాడ్సి, మంచిప్ప, ముదక్పల్లి, సిర్పూర్, న్యాల్కల్లో వర్షంలోనూ పర్యటించి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లతా కన్నీరాం, జడ్పీటీసీ సభ్యురాలు కమలానరేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొచ్చ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ మోహన్రెడ్డి, సర్పంచులు ముత్యంరెడ్డి, సిద్ధార్థ, భరత్, రవి, నాయకులు పాల్గొన్నారు.