మాక్లూర్/బాల్కొండ/ముప్కాల్/ఏర్గట్ల, ఆగస్టు 29 : మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. జిల్లాలోని మాక్లూర్, బాల్కొండ, ముప్కాల్, ఏర్గట్ల మండలాల సమాఖ్య సర్వసభ్య సమావేశాలను సోమవారం నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాలను ఎన్నుకున్నారు. మాక్లూర్లోని ఐకేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి జడ్పీ చైర్మన్ విఠల్రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంకు లింకేజీ రుణాలను అందిస్తున్నదన్నారు. మహిళల సామాజిక ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. రాష్ట్రంలోని ఐకేపీ సమాఖ్యల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలువడం గర్వకారణమన్నారు. సమావేశాల్లో డీపీఎం శ్రీనివాస్, ఏపీఎంలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
మాక్లూర్ : అధ్యక్షురాలు: సువర్ణ (కల్లడి), ఉపాధ్యక్షురాలు శాంత (రాంపూర్), ప్రధాన కార్యదర్శి అనిత (మాదాపూర్), సహాయ కార్యదర్శి లింగుబాయి (గుంజిలి), కోశాధికారి మౌనిక (గొట్టుముక్కల).
బాల్కొండ : అధ్యక్షురాలు సంగీత, ఉపాధ్యక్షురాలు సంధ్య, కార్యదర్శులు లత, కోశాధికారి లక్ష్మీప్రియ, సహాయ కార్యదర్శి అమృత.
ముప్కాల్ : అధ్యక్షురాలు: జ్యోతి (నల్లూర్), ఉపాధ్యక్షురాలు పద్మ(వెంచిర్యాల్), కోశాధికారి రిషిత (ముప్కాల్), కార్యదర్శి సవిత(ముప్కాల్), సహాయ కార్యదర్శి మానస (రెంజర్ల).
ఏర్గట్ల : అధ్యక్షురాలు సింధూజ, కార్యదర్శి వసంత (దోంచంద), కోశాధికారి జయశ్రీ (బట్టాపూర్).