కోటగిరి, ఆగస్టు 16: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్న తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అధ్యయనం చేసేందుకు మోదీ ప్రభుత్వం కేంద్ర బృందాలను సైతం పంపించిందని అన్నారు. మండలకేంద్రంలో నూతనతంగా నిర్మించిన వ్యవసాయ సహకార సంఘ భవనం, షాపింగ్ కాంప్లెక్స్ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలను మెచ్చుకొని కేంద్ర ప్రభుత్వమే అవార్డులను అందజేస్తున్నదని గుర్తుచేశారు.
దేశంలోనే ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో 15 రోజులపాటు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం కోసం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేస్తున్న కృషిని వివరించారు. ఇప్పటికే 10 వేల కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చామని, మరో 5వేల ఇండ్లు త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. అనంతరం విండో పాలకవర్గ సభ్యులు, జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భాస్కర్రెడ్డిని వేర్వేరుగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ వల్లెపల్లి సునీతాశ్రీనివాస్, జడ్పీటీసీ శంకర్పటేల్, వైస్ ఎంపీపీ గంగాధర్పటేల్, ఏఎంసీ చైర్పర్సన్ తేళ్ల లావణ్యాఅరవింద్, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, విండో చైర్మన్ సిద్ధూ, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు సిరాజ్, డీసీవో సింహాచలం, ఎత్తొండ విండో చైర్మన్ అశోక్పటేల్, నాయకులు ఎజాజ్ఖాన్, బర్ల గంగారాం, బీర్కూర్ గంగాధర్, సాయిలు, హౌగిరావుపటేల్, ప్రజాప్రతినిధులు, కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ సుధాకర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.