ఆర్మూర్, ఆగస్టు 16 : సీఎం కేసీఆర్ రైతులపై తన కు ఉన్న అభిమానాన్ని, ప్రేమను మరోసారి చాటుకున్నారు. ఇతర రాష్ర్టానికి చెందిన రైతు మరణించగా ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఇటీవల వివిధ రాష్ర్టాల నుంచి జాతీయ రైతు సంఘం కార్యకర్తలు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. ఈ పర్యటన అనంతరం విమల్కుమార్ అనే కార్యకర్త హైదరాబాద్లో గుండెపోటుతో మృతి చెందా డు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
శాంతకుమారి అధ్యక్షతన మైసూర్లో మంగళవారం ఏర్పాటు చేసిన రైతు సదస్సులో రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి చేతుల మీదుగా విమల్కుమార్ కుటుంబానికి చెక్కును అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు బాగున్నాయని.. కర్ణాటకలో కూడా అమలు చేయాలని సదస్సులో కోరారు. కార్యక్రమంలో దక్షిణ భారత రైతు సంఘాల అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు, తెలంగాణ రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వర్రావు, చేతన్ పాల్గొన్నారు.