బోధన్, ఆగస్టు 12: మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శమని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా పట్టణంలోని పోలీస్శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సర్వమత సమ్మేళనంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. మన దేశంలో భిన్న మతాలు, సంస్కృతులు ఉన్నప్పటికీ అన్ని వర్గాలవారు సోదరభావంతో కలిసిమెలిసి ఉంటారని తెలిపారు. పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఈనెల 13న బోధన్లో సామూహిక జాతీయ గీతాలాపన ఉంటుందని, ప్రతి ఒక్కరూ హాజరై దేశభక్తిని చాటాలన్నారు. ముందుగా ఎమ్మెల్యేతోపాటు ఏసీపీ రామారావు, పోలీస్ అధికారులకు మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు రాఖీలు కట్టారు. అనంతరం బోధన్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డులకు ప్రమాదబీమా కింద అందిన బాండ్లను ఎమ్మెల్యే షకీల్ అందజేశారు. సీఐలు ప్రేమ్కుమార్, శ్రీనివాసరాజు, తహసీల్దార్ వర ప్రసాద్, మారుతీ మందిర అర్చకుడు ప్రవీణ్ మహరాజ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్ యాదవ్, అబ్దుల్ రెహమాన్, ఎంఐఎం అధ్యక్షుడు ముషీర్బాబా, సమీ, మున్సిపల్ కౌన్సిలర్లు సత్యం, దూప్సింగ్నాయక్, శ్రీకాంత్ గౌడ్, నాయకులు అశోక్రెడ్డి, అశ్వాక్ అహ్మద్, ఎస్సైలు పాల్గొన్నారు.
మహిళా ప్రజాప్రతినిధులకు అభివృద్ధి నిధుల కానుక..
బోధన్ నియోజకవర్గంలోని మహిళా ప్రజాప్రతినిధులు తమ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాఖీ పండుగ సందర్భంగా నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో రక్షాబంధన్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేకు స్థానిక మహిళా ప్రజాప్రతినిధులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సోదరభావంతో వారికి సీడీపీ నిధుల నుంచి రూ.5లక్షల చొప్పున కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి, జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి, జడ్పీటీసీ గిర్దావర్ లక్ష్మీ గంగారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీతాదేశాయ్తోపాటు పలువురు ఆయనకు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రవీందర్ యాదవ్, అబ్దుల్ రెహమాన్, గోగినేని నరేంద్రబాబు, సిర్ప సుదర్శన్, ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వర్రావు దేశాయ్, వైస్ చైర్మన్ సాలూరా షకీల్, డీసీసీబీ డైరెక్టర్ శరత్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
డీఈఈ స్టేట్ ర్యాంకర్కు సన్మానం..
డీఈఈ ఉర్దూ మీడియం పరీక్షా ఫలితాల్లో సేట్ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఉమెరా పర్వీన్ను ఎమ్మెల్యే షకీల్ అభినందించారు. బోధన్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సన్మానించారు. కార్యక్రమంలో సాటాపూర్ సర్పంచ్ వికార్పాషా, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు హాజీఖాన్, ఎంపీటీసీ హైమద్, నాయకులు చంద్రశేఖర్రావు, హైమద్ఖాన్ పాల్గొన్నారు.