వేల్పూర్, ఆగస్టు 9 : మండల కేంద్రంలోని విద్యనభ్యసించిన (2003-04బ్యాచ్) స్నేహితులు తమ మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచారు. వేల్పూర్కు చెందిన భూమేశ్వర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అతడి స్నేహితులు రూ.58,500 నగదు జమ చేసి బాధిత కుటుంబానికి మంగళవారం అందజేసి అండగా నిలిచారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పిట్ల సత్యం, ఎంపీటీసీ మహేశ్, అశోక్, గడ్డం బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కౌలు రైతు కుటుంబానికి..
మండల కేంద్రంలోని దర్యాపూర్కాలనీకి చెందిన కౌలు రైతు డాంగే నారాయణ విద్యుత్షాక్తో మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని టీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. పార్టీ తరఫున మండల అధ్యక్షుడు వి.నర్సింగ్రావు రూ.10వేలు, జిల్లా నాయకుడు బీడీ దాస్ రూ.5వేల ఆర్థికసహాయం అందజేశారు. బాధిత కుటుంబ పరిస్థితిని ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ దృష్టికి తీసుకెళ్లి ఆదుకునేలా కృషి చేస్తామన్నారు. సీనియర్ నాయకులు తెడ్డు పోశెట్టి, బి.సూరిబాబు, నారాయణ, డాంగే పోతన్న, ఎంపీటీసీ డాంగే సతీశ్, సౌద శ్రీనివాస్, జావీద్, దేవరాజ్ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు.