కమ్మర్పల్లి, ఆగస్టు 9 : ఎస్సారెస్పీకి నీటి లభ్యతను అందిస్తూ.. అల్లంత దూరాన 200 కిలో మీటర్ల దిగువన ఉన్న కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని మళ్లించి ఎస్సారెస్పీ వరద కాలువకు జీవం పోసిన పునరుజ్జీవ పథకానికి పునాది పడి నేటి(బుధవారం)తో ఐదేండ్లు పూర్తయ్యింది. ఈ పథకం వరద కాలువల ను మూడు కాలాలూ నిండుగా ఉండే రిజర్వాయర్లా మార్చింది. సమైక్య పాలనలో ఎస్సారెస్పీపై నిర్లక్ష్యాన్ని మలి దశ ఉద్యమ ప్రారంభవేళ కేసీఆర్ ఎస్సారెస్పీపై నుంచే ఎండగట్టారు. స్వరాష్ట్రం సిద్ధించాక ఎస్సారెస్పీ పూర్వ వైభవం కోసం పునరుజ్జీవ పథకానికి రూపకల్పనచేశారు. కాళేశ్వరం జలాలను ఎదురెక్కించి ఎస్సారెస్పీలో పోసుకొనే విధంగా ఈ పథకాన్ని పూర్తి చేయించి శ్రీరాంసాగర్కు శాశ్వత నీటి భరోసా కల్పించారు.
ప్రాజెక్టుకు శాశ్వత భరోసాగా..
ఎగువ మహారాష్ట్రలో పుష్కలంగా వానలు కురిస్తేనే ఎస్సారెస్పీలో నీటి లభ్యత..లేదంటే ప్రాజెక్టు వెల వెల బోయే పరిస్థితి. గడిచిన మూడేండ్లుగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురియడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారిం ది. కానీ అంతకు ముందు ప్రా జెక్టు చరిత్రలో ఎగువన వర్షా భావ పరిస్థితులు నెలకొని జలాశయం ఎడారిలా మారిన సందర్భాలూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాలను అందించి పూ ర్వ వైభవం తీసుకువచ్చారు.
నీటి కొరత తీరేలా
1964-69 మధ్య నిర్మించిన ఎస్సారెస్పీని స్టేజి-1 కింద 9.68 లక్షల ఎకరాలు, స్టేజీ-2 కింద 5 లక్షల ఎకరాలు సాగు చేసేలా డిజైన్ చేశారు. కానీ 112 టీఎంసీల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం రాను రాను పూడిక చేరికతో 90 టీఎంసీలకు తగ్గిపోయింది. మరో వైపు కాకతీయ కాలువ కింద 4 లక్షల 60 వేల ఎకరాలకు 46 టీఎంసీలు, సరస్వతీ కెనాల్ కింద 36 వేల ఎకరాలకు 3.5 టీఎంసీలు, ప్యాకేజీ- 27, 28 కింద (ఆదిలాబాద్) లక్ష ఎకరాలకు 7 టీఎంసీలు, లక్ష్మీ కెనాల్, చౌట్పల్లి హన్మం త్ రెడ్డి ఎత్తిపోతల పథకం కింద 36 వేల ఎకరాలకు 4 టీఎంసీలు, గుత్ప, అలీ సాగర్ ఎత్తిపోతల ప థకం కింద 93 వేల ఎకరాలకు 7.3 టీఎంసీలు, ప్యాకేజీ- 21, 22 (నిజామాబాద్) కింద 4 లక్షల 40 వే ల ఎకరాలకు 33 టీఎంసీలు, తాగు నీరు, మిషన్ భగీరథకు 14.5 టీఎంసీలు, ఐడీసీ ఎత్తి పోతల పథకాల కింద 80 వేల ఎకరాలకు 7.7 టీఎంసీలు కలుపుకొని మొత్తం 12.45 లక్షల ఎకరాలకు 123 టీఎంసీలు అవసరం ఉందని గుర్తించారు. పరిష్కారంగా కాళేశ్వరం నీటిని 200 కిలో మీటర్ల దిగువ నుంచి రివర్స్ పంపింగ్తో వరద కాలువ ద్వారా ఎత్తుకు, ఉల్టా ప్రవహింప జేసి 60 రోజుల్లో 60 టీఎంసీలు నింపుకునేలా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి రూపకల్పన చేశారు.
2017లో శంకుస్థాపన
2017 ఆగస్టు 10న పోచంపాడ్లోని ఎస్సారెస్పీ సమీపంలోని వరద కాలువ జీరో పాయింట్ వద్ద పునరుజ్జీవ పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
మంత్రి వేముల నిరంతర కృషి
సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో ఇంజినీర్ అయిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక కృషితో అనతి కాలంలో పునరుజ్జీవ పథక నిర్మాణం పూర్తి చేసుకుంది. కాళేశ్వరం జలాలు వరద కాలువలో ఎగువకు ఎక్కుతూ ఉల్టా ప్రవహిస్తూ ఎస్సారెస్పీ గడపను ముద్దాడాయి. దీంతో నీటి జాడలు లేక తుమ్మ మొద్దులు నిండిన వరద కాలువ జీవం పోసుకొని ఏడాదంతా నిండు జలాశయంగా రూ పు దిద్దుకున్నది. ఇలా వరద కాలువ కాళేశ్వరం నీటితో ఎస్సారెస్పీ గడపను చేరాయి.
వరద కాలువ కింద సాగు జోరు
కాలువలో ఉన్న నీటిని చెరువులకు మళ్లించేందుకు తక్కువ ఎత్తులో కొత్త తూములు నిర్మించారు. ఫలితంగా ఎండా కాలమైనా చెరువులు నిండు కుండల్లా ఉంటున్నాయి. వరద కాలువ నీరు అందే చెరువులు, కాలువల కింద ప్రత్యక్షంగా, పరోక్షంగా నియోజకవర్గంలో ఐదు వేల ఎకరాలకు పైగా రెండు పంటలకు సాగు నీరు అందుతున్నది.