హైదరాబాద్లోని జలవిహార్లో శనివారం రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా నుంచి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు బేగంపేట విమానాశ్రయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డిని యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ పరిచయం చేశారు.