సదాశివనగర్, జూన్ 29: ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. మండల కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన బుధవారం పరిశీలించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, సర్పంచ్ బద్దం శ్రీనివాస్రెడ్డితో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్రామాల వారీగా విలేజ్ నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. మొక్కలు నాటేందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని, అందుకోసం మొక్కలను పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించా రు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేవిధంగా చూడాలన్నారు. ఎంపీడీవో లక్ష్మి, తహసీల్దార్ వెంకట్రావు, ఎంపీవో సురేందర్ రెడ్డి, ఏపీవో తిరుపతి నాయక్, ఏవో ప్రజాపతి, జీపీ కార్యదర్శులు, ఉపసర్పంచ్ వంకాయల రవి, కారోబార్ ఆస రాజేశ్వర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
హరితహారంలో భాగస్వాములు కావాలి..
కామారెడ్డిరూరల్/దోమకొండ, జూన్ 29 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. కామారెడ్డి మండలం ఉగ్రవాయి, దోమకొండ మండల కేంద్రం లో ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, డీపీవో శ్రీనివాస్రావు, డీఎల్పీవో సాయిబాబా, ఎంపీడీవోలు శంకర్, చిన్నారెడ్డి, ఎంపీవో మల్హ్హారీ, ఏపీవో రజిని, ఏవో శ్రీనివాస్రావు, ఏపీఎం శ్రీనివాస్, దోమకొండ ఎంపీపీ శారద, జడ్పీటీసీ తిరుమల్గౌడ్, సర్పంచ్ నల్లపు అంజలి, ఉప సర్పంచ్ శ్రీకాంత్, ఉగ్రవాయి సర్పంచ్ సుమిత తదితరులు పాల్గొన్నారు.