ఇందూరు, జూన్ 28 : జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో 291 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా మంగళవారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లలు ఉన్న పేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం ఎంతో భరోసా కల్పిస్తున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ వివిధ సంక్షేమ పథకాలను అందజేస్తూ ప్రతి ఇంటికీ పెద్దదిక్కయ్యారని తెలిపారు. ఆయన సారథ్యంలో సంక్షేమ పథకాలను అందజేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్, కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
నగరంలో అభివృద్ధి పనుల పరిశీలన
నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గణేశ్గుప్తా పరిశీలించారు. వైకుంఠధామాలు, రఘునాథ చెరువు ట్యాంక్బండ్, అహ్మదీబజార్ సమీకృత మార్కెట్ భవనం పనుల పురోగతి వివరాలు తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిత్రామిశ్రా, మున్సిపల్, ఆర్అండ్బీ, పబ్లిక్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు.