ఇందూరు, జూన్ 28 : 2021-22 విద్యా సంవత్సరానికి గాను మే లో నిర్వహించిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదల కాగా బాలికలు పైచేయి సాధించారు. నిజామాబాద్ జిల్లాలో 15742 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయగా 10,372 మంది (65 శాతం) ఉత్తీర్ణులైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. మొదటి సంవత్సరంలో 15,360 విద్యార్థులు పరీక్షలు రాయగా 8,974 మంది (58శాతం) ఉత్తీర్ణులయ్యారన్నారు. ఒకేషనల్ మొదటి సంవత్సరంలో 2,190 మంది విద్యార్థులకు గాను 946 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 43 శాతం, 2వ సంవత్సరంలో 2,008 మందికి గాను 1,036 మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచిందన్నారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 55 శాతం, బాలికలు 74 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. మొదటి సంవత్సరంలో బాలికలు 68 శాతం, బాలురు 47 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారన్నారు. ఒకేషనల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు 69 శాతం, బాలురు 43 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. మొదటి సంవత్సరంలో బాలికలు 63 శాతం, బాలురు 34 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. మూడు సంవత్సరాల ఫలితాలతో పోలిస్తే జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు.
కామారెడ్డిలో..
విద్యానగర్, జూన్ 28 : కామారెడ్డి జిల్లాలో ఇంటర్ మొదటి సం వత్సరంలో 8,528 మంది విద్యార్థులకు గాను 5,356 మంది విద్యార్థులతో 62 శాతం ఉత్తీర్ణత సాధించారని ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.బాలురు 4304 మందికి గాను 2,303 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో 4224 మందికి గాను 3053 మంది పాస్ అయ్యారు. ఒకేషనల్ 1,232 మందికి గాను 576 మంది విద్యార్థులతో 46 శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలురు 659 మందికి గాను 178 మంది, బాలికలు 573 మందికి గాను 398 మంది పాస్ అయ్యారు. రెండో సంవత్సరంలో జనరల్ విద్యార్థుల్లో 8,183 మంది విద్యార్థులకు గాను 5316 మంది విద్యార్థులతో 64 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 4032 మందికి గాను 2,258 మంది, బాలికలు 4152 మందికి గాను 3058 మంది పాస్ అయ్యారు. ఒకేషనల్ లో 1025 మందికి గాను 619 మంది విద్యార్థులతో 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 495 మందికి గాను 229 మంది, బాలికలు 530 మందికి గాను 390 మంది పాస్ అయ్యారని తెలిపారు. ప్రైవేట్ విద్యార్థుల్లో ద్వితీయ సంవత్సరంలో 110 మందికి గాను 31 ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్లో 10 మంది విద్యార్థులకు గాను ముగ్గురు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.