నిజామాబాద్ క్రైం,జూన్ 28 : జల్సాలు చేసేందుకు దొంగతనాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్న పాత నేరస్తుడిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు వెల్లడించారు. గతంలో సైతం తొమ్మిది దొంగతనాలు చేసి జైలు కు వెళ్లి వచ్చిన నేరస్తుడు నిజామాబాద్ నగరంలోని శాస్త్రి నగర్కు చెందిన మేకల సుదర్శన్ మళ్లీ ఈ నెల 6వ తేదీన జిల్లా కేంద్రంలోని ఓ క్లాథ్ స్టోర్లో రూ.9 లక్షలు దొంగిలించినట్లు తెలిపారు. ఈ సంఘటనపై వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు. కోసం ఓఎస్డీ నరేందర్ రెడ్డి పర్యవేక్షణలో ఏసీపీ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో వన్టౌన్ ఎస్హెచ్వో విజయ్ బాబు తన టీమ్తో కలిసి నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. చోరీ చేసిన అనంతరం నిందితుడు ముంబాయికి పారిపోయి అక్కడ జల్సాలు చేస్తున్నట్లు తెలియడంతో ఒక టీమ్ అక్కడికి వెళ్లి నిందితుడిని పట్టుకున్నారని సీపీ వెల్లడించారు. నిందితుని వద్ద నుంచి రూ.4లక్షల 33వేల 750 నగదును స్వాధీనం చేసకున్నట్లు తెలిపారు. పాత నేరస్తుడిని పట్టుకోవడానికి కృషి చేసిన టీమ్ను సీపీ నాగరాజు అభినందించారు.