సదాశివనగర్/పిట్లం/నిజాంసాగర్/లింగంపేట/గాంధారి/ఎల్లారెడ్డి/ బాన్సువాడ రూరల్/ బాన్సువాడ టౌన్/బీర్కూర్/ దోమకొండ, జూన్ 28: ఇంటర్ ఫలితాల్లో సదాశివనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 99శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ అజ్మల్ఖాన్, మోడల్ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వంద శాతం, ప్రథమ సంవత్సరం విద్యార్థులు 97 శాతం ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ భానుమతి తెలిపారు.
సదాశివనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ముస్కాన్ బేగం బైపీసీ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితలలో 433 సాధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలల విభాగంలో మొదటి స్థానం సాధించిందని ప్రిన్సిపాల్ అజ్మల్ ఖాన్ తెలిపారు. ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. పిట్లంలోని జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థినులు ఇంటర్లో వందశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ గులాం రబ్బానీ తెలిపారు.
నిజాంసాగర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఇంటర్లో 69శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ చంద్రకళ తెలిపారు. సెకండ్ ఇయర్లో 89 మందికి గాను 61, ఫస్ట్ ఇయర్లో 94 మందికి 65 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. లింగంపేట మండలంలోని లింగంపల్లి మైనార్టీ గురుకుల కళాశాలలో ప్రథమ సంవత్సరం బైపీసీలో శరత్గౌడ్ 426, ఎంపీసీలో శివసాయి 450 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ వెంకటరాములు తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 84.37 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్రెడ్డి తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 214 మందికి 159, రెండో సంవత్సరంలో 192 మందికి 162 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఎల్లారెడ్డిలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 68 శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ సాయిబాబా తెలిపారు. గాంధారి ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు 75 శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ గంగారాం తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో బస్సీ రమేశ్ 969, ఎం.జ్యోతి 822, బైపీసీలో భజన్లాల్ 832, సీహెచ్ లావణ్య 781, సీఈసీలో రఘునాథ్ 648 మార్కులు సాధించారన్నారు.
మొదటి సంవత్సరం ఎంపీసీలో షఫీకా తరుణమ్ 460, జి.అశ్విని 426, రాంసింగ్ సీఈసీలో350 మార్కులు సాధించారని అన్నారు.బాన్సువాడ మండలంలోని కొత్తాబాది మోడల్ కళాశాల నుంచి సెకండియర్లో ఎంపీసీలో శ్రీహిత రాణి 1000/960 మార్కులు, బైపీసీలో అఫ్సాన్ 1000/945, సీఈసీలో పద్మావతి 1000/852 సాధించి కళాశాల టాపర్లుగా నిలిచారు. ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో అరుణ్కుమార్ 470/455 మార్కులు, బైపీసీలో సద్గుణ 440/432 , సీఈసీలో అపర్ణ 500/469 సాధించారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం పరీక్షలు 178 మంది రాయగా 98 మంది పాసయ్యారు. ఆయేషా బేగం 896/1000 మార్కులతో ప్రథమ స్థానంలో, మేరాజ్ బేగం 885/1000 మార్కులతో ద్వితీయ స్థానం, జే.ఉదయ్ కుమార్ 783/1000 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. ప్రభుత్వ బాలికల కళాశాలలో రెండో సంవత్సరంలో 263 మందికి 185 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 188 మందికి 132 మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు. అందులో మొదటి సంవత్సరం విద్యార్థిని జి.మంజుల 486/500 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో సుచరిత 946/1000 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది.
రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు..
బీర్కూర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన జజ్జల శివాని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 462/ 470 మార్కులతో రాష్ట్ర స్థాయి ఆరో ర్యాంకును సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మోహన్రెడ్డి తెలిపారు. కళాశాల నుంచి ఎపిశెట్టి శివాని బైపీసీలో 413 /470 మార్కులను సాధించి ద్వితీయ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఎంపీసీ, బైపీసీలలో నూరు శాతం ఉత్తీర్ణత, సీఈసీలో 60 శాతం, ఒకేషనల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. కస్తూర్బా పాఠశాల విద్యార్థిని పైడికుల్వార్ వర్ష ఎంపీసీలో 449/470 మార్కులను సాధించి కళాశాల టాపర్గా నిలిచిందని ప్రత్యేకాధికారి కద్మ గీత తెలిపారు. బీర్కూర్లోని మహత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఎంపీసీలో ఎన్ సాయికుమార్ 459 /470 మార్కులను సాధించి టాపర్గా, బైపీసీలో బి.సంతోష్ 433/ 470 మార్కులను సాధించి ద్వితీయ స్థానంలో నిలిచాడని ప్రిన్సిపాల్ మాధవి తెలిపారు. దోమకొండ సాంఘిక సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ శంకర్ పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సరంలో ఎస్.పంక్తి ఎంపీసీలో 981/1000 మార్కులు సాధించి టాపర్గా, బైపీసీలో సౌజన్య 964/100, ఎంఎల్టీలో లక్ష్మీప్రియ 979/1000, ప్రథమ సంవత్సరంలో బైపీసీలో 432/440, ఎంఎల్టీలో 493/500 పొందినట్లు తెలిపారు.
బాన్సువాడ పరిధిలోని ప్రైవేట్ కళాశాలల్లో..
రేణుక ఒకేషనల్ కళాశాల నుంచి ప్రథమ సంవత్సరంలో మంగళి అర్చన 489/500 మార్కులు, కే. సౌజన్య 487/500 సాధించింది. మోహన్ 482/500, ద్వితీయ సంవత్సరంలో పీ.శివలక్ష్మి 974/1000, కరిష్మా 966/1000, టీ. శ్యామల 961/1000 మార్కులు సాధించి బాన్సువాడ డివిజన్ టాపర్గా కళాశాలను నిలిపారు. సాయికిరణ్ ఒకేషనల్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో వెన్నెల 479/500 మార్కులు, స్వాతి 478/500, లావణ్య 465/500, సౌజన్య 462/500 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో స్వరూప 935/1000, సానియా 919/1000, ప్రశాంతి 914/1000 మార్కులు సాధించారు.