పిట్లం, జూన్ 24: నియోజకవర్గ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తెల్లజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మార్క్ఫెడ్ సహకారంతో విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెల్లజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వం తెల్లజొన్నలను రూ.2,738కి క్వింటాలు చొప్పున కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. వచ్చే యాసంగిలో రైతులు తెల్లజొన్నలను సాగుచేయొద్దని, ఇతర ఆరుతడి పంటలను వేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, మార్క్ఫెడ్ డీఎం రంజిత్రెడ్డి, జిల్లా సహకార అధికారిణి వసంత, విండో చైర్మన్ శపథంరెడ్డి, ఎంపీపీ కవితా విజయ్, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీబాయీ బాబూసింగ్, పిట్లం సర్పంచ్ విజయలక్ష్మీ శ్రీనివాస్రెడ్డి, పెద్దకొడప్గల్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి, విండో వైస్ చైర్మన్ పుట్టిరాములు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ దేవేందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సాయిరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, విండో సీఈవో సంతోష్రెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి వజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
రైతుబీమా చెక్కు అందజేత..
అన్నదాతల కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే షిండే అన్నారు. తిమ్మానగర్ గ్రామానికి చెందిన మహిళా రైతు రామవ్వ ఇటీవల మృతిచెందగా.. నామినీ అయిన ఆమె భర్త బాబన్నకు మంజూరైన రూ.ఐదు లక్షల బీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఆయన వెంట పలువురు నాయ కులు ఉన్నారు.
సీలింగ్ ఫ్యాన్ల పంపిణీ..
నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన ఐకేపీ వీవోలకు సీలింగ్ ఫ్యాన్లను ఎమ్మెల్యే మండల కేంద్రంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం డ్వాక్రాసంఘాల అభివృద్ధికి కృషిచేస్తున్నదని అన్నారు. నియోజకవర్గంలోని 162 మంది వీవోలకు సీలింగ్ ఫ్యాన్లను పంపిణీ చేశారు. రెడ్కో ఎండీ గంగాధర్, ఐకేపీ డీపీఎం సుధాకర్, ఆరు మండలాలకు చెందిన ఏపీఎంలు, వీవోలు పాల్గొన్నారు.