భిక్కనూర్, జూన్ 24 : దళితబందు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన దళితబంధు లబ్ధిదారులు దినేశ్కు టెంట్ హౌజ్, రాజుకు సెంట్రింగ్ దుకాణం మంజూరైంది. లబ్ధిదారులకు గంప గోవర్ధన్ శుక్రవారం మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల ఆర్థికాభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితులకు రూ.10లక్షల చొప్పున ఇవ్వడం హర్షణీయమన్నారు. దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గ్గొన్నారు.
సొసైటీ భవనం, సిమెంట్ రోడ్డు ప్రారంభం
బస్వాపూర్లో నిర్మించిన సహకార సంఘ భవనంతోపాటు బీరప్ప ఆలయాన్ని, సిమెంట్ రోడ్లను విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. కేంద్రప్రభుత్వం తెలంగాణపై కక్ష సాధిస్తున్నదని, నిధులు మంజూరు చేయకుండా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నదని విమర్శించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో అమలుకాని పథకాలను సీఎం కేసీఆర్ మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతులను ఆదుకుంటున్నారన్నారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. ఇప్పటికే వేలాది ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలను అమలు చేస్తున్నదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ గాల్రెడ్డి, జడ్పీటీసీ పద్మానాగభూషణం గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్, వైస్ చైర్మన్ హనుమంత్రెడ్డి, సర్పంచ్ మంజులామల్లారెడ్డి, ఉప సర్పంచ్ భిక్షపతి, ఎంపీటీసీ యశోదాబాలాగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాంచంద్రం, డీసీసీబీ డైరెక్టర్లు లింగాల కిష్టాగౌడ్, గోన్లె సిద్ధిరాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్, టీఆర్ఎస్ యూత్ విభాగం అధ్యక్షుడు రంజిత్వర్మ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, వైస్ ఎంపీపీ యాదగిరి, కో-ఆప్షన్ సభ్యురాలు సుల్తానా, మాజీ ఎంపీపీ సుదర్శన్, సిద్ధిరామేశ్వర ఆలయ చైర్మన్ మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధి రాంరెడ్డి, తహసీల్దార్ నర్సింహులు, ఎంపీడీవో అనంత్రావు, ఎంపీవో ప్రవీణ్కుమార్, నాయకులు మధుసూదన్రెడ్డి, మంద దేవయ్య, రాజిరెడ్డి, సిద్ధాగౌడ్, సాయాగౌడ్, రవీందర్ రెడ్డి, సిద్ధి రాంరెడ్డి, రాజలింగం, జీవన్రెడ్డి, స్వామి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.