లింగంపేట/తాడ్వాయి/ఎల్లారెడ్డి రూరల్ /నిజాంసాగర్ /పిట్లం, జూన్ 21: లింగంపేట, తాడ్వాయి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, పిట్లం గ్రంథాలయాలకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను వితరణ చేశారు. వీటిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్ మంగళవారం ఆయా గ్రంథాలయాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీ పరీక్షలతోపాటు, వ్యాస రచన, క్విజ్ పోటీలకు సంబంధించిన పుస్తకాలను మంత్రి అందజేశారని చెప్పారు. ఉద్యోగార్థులు, విద్యార్థులు, పాఠకుల తరఫున మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లారెడ్డి గ్రంథాలయంలో ఐదుగురు విద్యార్థులకు డిక్షనరీలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు లావణ్య, సంజీవ్, గ్రంథపాలకులు శ్రీనివాస్, రాజలింగం, సుధాకర్, జిల్లా అధికారిణి మౌనిక, నిజాంసాగర్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సాదుల్ల సత్యనారాయణ, సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి, నాయకులు సందీప్కుమార్, రమేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.
జానపద కళాకారుడికి సన్మానం
పిట్లం లైబ్రరీవద్ద జానపద కళాకారుడు దేవగౌడను గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ పున్న రాజేశ్వర్ మంగళవారం ఘనంగా సన్మానించారు. మారుమూల గ్రామానికి చెందిన దేవగౌడ పేరు.. మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మల్టీటాలెంటెడ్ పర్సన్గా నమోదు కావడం అభినందనీయమని అన్నారు. కళలను ప్రతి ఒక్కరూ పోత్సహించాలని సూచించారు. అంతకు ముందు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను లైబ్రరీకి అందజేశారు. జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు విజయ్, శ్రీనివాస్రెడ్డి, గ్రంథపాలకుడు శంకర్ పాల్గొన్నారు.