ఖలీల్వాడి, జూన్ 11: సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తారంటేనే బీజేపీ నాయకులకు భయం పట్టుకున్నదని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని శనివారం వారు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీ నా యకులు బండి సంజయ్, లక్ష్మణ్, కిషన్రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బం డి సంజయ్ మాట్లాడే మాటలకు అర్థం ఉందా అని ప్రశ్నించారు. మోదీ దేశాన్ని అగ్రగామిగా నిలిపాడని మాట్లాడుతుండడం సిగ్గనిపించడంలేదా అన్నారు. దేశాన్ని అమ్మడంలో అగ్రగామిగా మో దీ ఉన్నారని విమర్శించారు. మోదీ స్నేహితుడు అదానీ కోసం దేశాన్ని తాకట్టు పెడుతున్నాడని ఆరోపించారు.
అదానీకి ఆస్ట్రేలియాలో బొగ్గు గను లు ఉన్నాయని, ఆయన కోసం విదేశాలకు వెళ్లి 30 వేలకు టన్ను కొనాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని అన్నారు. మన దగ్గర బొగ్గు మూడు వేలకే దొరుకుతుందన్నారు. మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నాడని ఆరోపించారు. డాలర్ విలువ 78 రూపాయలకు చేరిందని, బంగ్లాదేశ్, నేపాల్ కరెన్సీ విలువ పెరిగిందన్నారు.దేశాన్ని మొత్తం అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లేని అభివృద్ధి తెలంగాణలో కనిపిస్త లేదా అని ప్రశ్నించారు. 24 గంటల విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు తదితర పథకాలు కనిపించడంలేదా అని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జడ్పీ చైర్మన్ విఠల్రావు, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.