ఆర్మూర్, మే 22 : డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పోచమ్మగల్లీలో 1300 ప్లాట్లలో నిర్మిస్తున్న 263 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నాణ్యతతో పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అధికారులు నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. విద్యుత్ ఏర్పాటు పనులు ఎప్పటివరకు పూర్తి చేస్తారో నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఇండ్లు లేని నిరుపేదలను ఎంపిక చేసి వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను అందించాలని అన్నారు. మరిన్ని ఇండ్ల నిర్మాణం కోసం స్థలం కేటాయించేలా చూడాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.