రెంజల్, మే 22 : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో ఉన్న త్రివేణి సంగమ నదీ తీరాన సీతారాం సంత్ సేవా ఆశ్రమం పక్కన పరమేశ్వర్ దాస్ మహరాజ్ ఆధ్వర్యంలో చాతుర్మాస దీక్షలు కొనసాగుతున్నాయి. లోక కల్యాణార్థం వసంత పంచమి పర్వదినం రోజున ప్రారంభమైన చాతుర్మాస దీక్షలు.. ఏరువాక (సత్యగంగ) పౌర్ణమి వరకు కొనసాగుతాయని భక్తులు తెలిపారు. తన చుట్టూ మండుతున్న పిడకలను ఉంచడంతోపాటు ఎండను లెక్క చేయకుండా నాలుగు నెలల పాటు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జపం చేస్తారని తెలిపారు. గోదావరినదీ తీరాన ప్రారంభించిన చాతుర్మాస దీక్షలు 10 సంవత్సరాలుగా చేపడుతున్నట్లు సీతారాం త్యాగి మహరాజ్ తెలిపారు.