మద్నూర్, మే 22 : పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి డీఈవో రాజు అన్నారు. మద్నూర్ మండలకేంద్రంలోని జడ్పీ బాలికల పాఠశాలలో నిర్వహించే పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆదివారం ఆయన తనిఖీ చేశారు. సోమవారం నుంచి జరిగే పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా కేంద్రానికి హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు నిర్వహించే గదుల్లో వెలుతురు బాగా ఉండాలని సూచించారు. ఆయన వెంట మండల విద్యాధికారి రాములు ఉన్నారు.
పరీక్షల నిర్వహణ పక్కాగా ఉండాలి
నిజాంసాగర్, మే 22 : నేటి నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షల నిర్వహణ పక్కాగా ఉండాలని మం డల విద్యాశాఖాధికారి దేవీసింగ్ సూచించారు. నిజాంసాగర్ మండల విద్యాశాఖ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులు, ఇన్విజిలెటర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలో ఏడు ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా, ఆదర్శ, గురుకుల పాఠశాలకు చెందిన 524 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, ఇందుకోసం మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. నిజాంసాగర్ పరీక్షా కేంద్రంలో 170 మంది విద్యార్థులు, 9 మంది ఇన్విజిలేటర్లు ఉండగా ఆదర్శ పాఠశాల పరీక్షా కేంద్రంలో 189 మంది విద్యార్థులు 9 మంది ఇన్విజిలేటర్లు, మహ్మద్నగర్ పరీక్షా కేంద్రంలో 165 మంది విద్యార్థులకుగాను 10 మం ది ఇన్విజిలెటర్లు ఉన్నారని వివరించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. నిజాంసాగర్ పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్గా అమర్సింగ్, మహ్మద్నగర్ పరీక్షా కేంద్రానికి వెంకటేశం, ఆదర్శ పాఠశాల పరీక్షా కేంద్రానికి శ్రీరాంను నియమించామని తెలిపారు. విద్యార్థులు భయా న్ని వీడి పరీక్షలు రాయాలని సూచించారు.
పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు లింగంపేట మండల విద్యాశాఖ అధికారి రామస్వామి తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లోని 16 ప్రభుత్వ, గురుకుల పాఠశాలలకు చెందిన 553 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. మండల కేం ద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 170 మంది విద్యార్థు లు, బాలికల ఉన్నత పాఠశాలలో 156 మంది విద్యార్థులు, జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 170 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 38 మంది విద్యార్థులు నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట ప్రభుత్వ పాఠశాలలో, మోతె గ్రామానికి చెందిన 19 మంది విద్యార్థులు తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు.
విద్యార్థుల హాల్టికెట్లు ఇప్పటికే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. బిచ్కుంద మండలకేంద్రంలోని మూడు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి రాములు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు పరీక్షా కేంద్రాల్లో 590 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వెల్లడించారు. సీసీ కెమెరాల నిఘాలో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, ఏమైనా సమస్యలు ఉంటే ఇన్విజిలెటర్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ఎల్లారెడ్డిలో పదో తరగతి పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మండల విద్యాశాఖ అధికారి వెంకటేశం తెలిపారు ఎల్లారెడ్డిలో పరీక్షల కోసం నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటిలో 809 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. తాడ్వాయి మండలంలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో రామస్వామి తెలిపారు. 466 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన తెలిపారు.