మోర్తాడ్, మే 15 : సుంకెట్ గ్రామంలో ఒకే రోజు నాలుగిండ్లలో చోరీ జరిగిన సంఘటన మండలం లో కలకలం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి దొంగలు తాళాలు పగులగొట్టి 8 తులాల బంగా రం, 5 తులాల వెండి, రూ.50వేల నగదును అపహరించారు. వివరాల్లోకి వెళ్తే.. ఉక్కపోత విపరీతంగా ఉండడంతో శనివారం అర్ధరాత్రి కడారి సామేల్, దాసరి శారద, కాసర్ల గంగాధర్, శ్రీరాం మారుతికి చెందిన కుటుంబాల వారు ఇండ్లకు తాళాలు వేసి దాబాపై పడుకున్నారు. ఇదే అదునుగా గమనించిన దొంగలు తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసి చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీరాం మారు తి ఇంట్లో 3తులాల బంగారం, దాసరి శారద ఇం ట్లో 5 తులాల బంగారం, కాసర్ల గంగాధర్ ఇంట్లో 5 తులాల వెండి, కడారి సమేల్ ఇంట్లో రూ.50 వేలు దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీమ్తో సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్యంరాజు తెలిపారు.
పెండ్లి కోసం ఉంచుకున్న బంగారం చోరీ
దాసరి శారద భర్త చనిపోగా కూతురుతో కలిసి ఉంటున్నది. కూతురు పెండ్లి కోసమని దాచుకున్న 5 తులాల బంగారం దొంగలు దోచుకోవడంతో కన్నీరు పెట్టుకుంది. శ్రీరాం మారుతి వృత్తి పరంగా ఇతరులకు నగలు చేసి ఇచ్చేందుకు శనివారం రాత్రి మెట్పల్లి నుంచి 3 తులాల బంగారాన్ని కొనుగోలు చేసి తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇటీవలే బహ్రెయిన్ నుంచి వచ్చిన కడారి సామేల్ అనే వ్యక్తి రూ.5వేలు ఇండియా నగదుతో పాటు రూ.45వేల విలువ గల బహ్రెయిన్ నగదును దా చుకున్నాడు, వీటన్నింటినీ దొంగలు దోచుకెళ్లడం తో బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.