కోటగిరి/ ఖలీల్వాడి/రుద్రూర్/ వర్ని/ మోస్రా (చందూర్)/ నందిపేట్/ఎడపల్లి/ఆర్మూర్, జూలై 8 : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. పెంచిన సిలిండర్ ధరలకు నిరసనగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నిరసనలు తెలిపారు.
నిజామాబాద్ నగరంలోని బస్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరలను ఇష్టం వచ్చినట్లుగా పెంచుతున్నదని, రాబోయే రోజుల్లో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కోటగిరిలో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, జడ్పీటీసీ శంకర్పటేల్, మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాస్, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, విండో చైర్మన్ కూచి సిద్ధు, తేళ్ల అరవింద్, సలీం, పి.సాయిలు, శోభ, గంగామణి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
రుద్రూర్ మండలకేంద్రంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బస్టాండ్ సమీపంలో రోడ్డుపై బైఠాయించి కట్టెల పొయ్యిపై వంట చేశారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్షంలో సైతం గంట పాటు నిరసన తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు నారోజి గంగారాం, వైస్ ఎంపీపీ సాయిలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు గంగారాం, విండో చైర్మన్ సంజీవ్రెడ్డి, సీనియర్ నాయకుడు అక్కపల్లి నాగేందర్, రైతుబంధుసమితి మండల అధ్యక్షుడు సంగయ్య, యువజన విభాగం అధ్యక్షుడు రవి, లాల్మహ్మద్, మోహన్, సర్పంచులు ఖాదర్, గంగారాం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
వర్ని మండలకేంద్రంలో కట్టెల పొయ్యి పెట్టి వంట చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ వెలగపూడి గోపాల్, సహకార సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, శ్రీనగర్ సర్పంచ్ రాజు, నాయకులు మేక వీర్రాజు, కల్లాలి గిరి, అంబర్ సింగ్, మేక బుజ్జి, అహ్మద్, గఫార్, రమేశ్ గౌడ్, బానోత్ శ్రీధర్, బాబు తదితరులు పాల్గొన్నారు.
నందిపేట్లో సీపీఐఎంఎల్ ప్రజాపంథా ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తంచేశారు. ఎడపల్లిలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి, మండల కార్యదర్శి జంగం గంగాధర్, మండల అధ్యక్షురాలు లక్ష్మి, పోశెట్టి పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పండిత్ ప్రేమ్, వైస్ చైర్మన్ షేక్ మున్నా, సిద్ధుల గుట్ట ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు చంద్రశేఖర్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు గంగామోహన్ చక్రు, హన్మాండ్లు, వరలక్ష్మీలింబాద్రిగౌడ్, రాము, సయ్యద్ ఫయాజ్, భూషణ్, పట్టణ యూత్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, సోషల్ మీడియా ఇన్చార్జి శివప్రసాద్ పాల్గొన్నారు.