ఖలీల్వాడి, ఆగస్టు 4 : నిజామాబాద్ జిల్లాలో గురువారం 432 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 43 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యారోగ్యాధికారి సుదర్శనం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 66,554 కొవిడ్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
డిచ్పల్లి, ఆగస్టు 4: జక్రాన్పల్లి మం డల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థినులకు క రోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రిన్సిపాల్ రాజేశ్రెడ్డి తెలిపారు. గురువారం రెం డో డోస్ టీకాలు వేసే కార్యక్రమం లో భాగంగా 98 మంది విద్యార్థినులకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా, ఇం దులో పది మందికి పాజిటివ్గా ని ర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. మి గతా వారందిరికీ బూస్టర్ డోస్ వేసినట్లు తెలిపారు. పాజిజివ్ వచ్చిన విద్యార్థినులను వారి ఇండ్లకు పంపించనున్నట్లు చెప్పారు. పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో పాఠశాల, హాస్టల్, పరిసరాల్లో శానిటైజ్ చేయించారు.
మాక్లూర్, ఆగస్టు 4: మండల కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థులకు గురువారం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు పీహెచ్సీ వైద్యుడు సంజీవ్రెడ్డి తెలిపారు. వారికి కరోనా కిట్స్ అందజేసి, 15 రోజులు పాటు హోం ఐసోలేషన్లో ఉండాలని సూచించినట్లు చెప్పారు. మిగతా విద్యార్థులకు కూడా కరోనా టెస్టులు చేస్తామని తెలిపారు.