నిజామాబాద్ క్రైం, జూన్ 25 : పగటి సమయంలో అపార్ట్మెంట్లలో రెక్కీ నిర్వహించి.. తాళం వేసి ఉన్న ఫ్ల్లాట్లనే టార్గెట్గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న వ్యక్తికి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఏసీపీ వెంకటేశ్వర్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని అకోలా ప్రాంతానికి చెందిన రషీద్ షాహా అలియాస్ తల్వార్ సింగ్ (49) 15 సంవత్సరాలుగా వివిధ జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్నాడని తెలిపారు. పగటి సమయంలో అపార్ట్మెంట్లలో ఫ్రిడ్జిలు, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులకు రిపేర్ చేస్తామని తిరుగుతూ తాళం వేసిన ఇండ్లను గుర్తిస్తాడని, రాత్రివేళ తాళం వేసిన ఇండ్లలో చోరీకి పాల్పడుతాడని తెలిపారు.
నిజామాబాద్ నగరంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 12న అర్ధరాత్రి రెండు అపార్ట్మెంట్లలో చోరీకి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. నగరంలోని బోధన్ బస్టాండ్ వద్ద శనివారం పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి సుమారు 10 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు కృషిచేసిన నగర సీఐ కృష్ణ, వన్టౌన్ ఎస్సై-2 శ్రావణ్ కుమార్, ఏఎస్సై షకీల్, కానిస్టేబుళ్లు వంశీ, నిషిత్, స్వామికి సీపీ నాగరాజు చేతుల మీదుగా రివార్డు అందజేయనున్నట్లు తెలిపారు.