బోధన్, జూన్ 23: రాయలసీమ ఎక్స్ప్రెస్ను బోధన్ వరకు పొడిగించాలన్న ప్రతిపాదన మేరకుట్రయల్ రన్లో భాగంగా గురువారం బోధన్ రైల్వేస్టేషన్ వరకు నడిపారు. తిరుపతి – నిజామాబాద్ మధ్య నడిచే ఈ రైలును బోధన్ వరకు పొడిగించాలని చాలాకాలంగా బోధన్ ప్రజలు డిమాండ్చేస్తున్నారు. బోధన్ వరకు పొడిగించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు గురువారం నుంచి కొన్ని రోజులపాటు ట్రయల్ రన్ చేయనున్నారు.
ఉదయం 10.30 గంటలకు నిజామాబాద్ నుంచి బయల్దేరిన రాయలసీమ ఎక్స్ప్రెస్ బోధన్కు 11.30 గంటలకు చేరుకున్నది. బోధన్లో బోగీలను శుభ్రంచేశారు. అనంతరం తిరిగి నిజామాబాద్కు తిరిగివెళ్లింది. ఈ ట్రయల్ రన్ను రైల్వేశాఖ నిజామాబాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అవినాష్, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ఉదయ్కుమార్, టెక్నీషియన్లు పర్యవేక్షించారు.