ఎడపల్లి, ఆగస్టు 18 : అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమేర్ అన్నారు. ఎడపల్లి మండలంలో గురువారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎడపల్లి సాయిబాబా ఆలయ వ్యవస్థాపకుడు వెంకటేశ్వర శర్మ అదనపు తరగతి గది నిర్మాణం కోసం సాయి ట్రస్ట్ ద్వారా రూ.4లక్షల 25వేలు అందజేశారు.
సీడీపీ నిధులతో చేపట్టనున్న ఏసీ డైనింగ్ హాల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం మండలంలోని ఎమ్మెస్సీ ఫారంలో రూర్బన్ పథకం నిధులు సుమారు రూ.17లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అదే గ్రామంలో రూ.10లక్షల సీడీపీ నిధులతో చేపట్టనున్న మహిళా, బీసీ కమ్యూనిటీ హాల్, మైనారిటీ శ్మశాన వాటిక ప్రహరీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం సుమారు రూ.30 లక్షలు కేటాయిస్తామన్నారు.
కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్దేశాయ్, ఏసీపీ రామారావు, జడ్పీవైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, ఎంపీపీ కె.శ్రీనివాస్, ఎంపీడీవో సయ్యద్సాజీద్ అలీ, తహసీల్దార్ ఆకుల శేఖర్, ఎంపీవో సూభాష్చంద్రబోస్, రూరల్ సీఐ శ్రీనివాసరాజు, ఎడపల్లి ఎస్సై పాండేరావు, సొసైటీ చైర్మన్ పోల మల్కారెడ్డి, సర్పంచులు విజయ్కుమార్, సావిత్రీరవీందర్గౌడ్, ఆకుల మాధవీశ్రీనివాస్, అలేఖ్య, మహేశ్గౌడ్, పిస్క గంగాప్రసాద్, పోట్టోళ్ల సాయిలు, బట్టు హన్మాండ్లు, అమానుల్ల షరీఫ్, ఎంపీటీసీలు నాగేందర్రెడ్డి, నాయుడు స్రవంతీపోతన్న, గుంజరి మనీషారెడ్డి, పద్మ ముత్తెన్న, మంద సంజీవ్, వనజానాగరాజు, వి.రామ్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేరడి శ్రీరామ్, నాయకులు, ఎంఏ రజాక్, ఎల్లయ్యయాదవ్, అబ్దుల్ వహబ్ బారీ, న్యావనంది సూభాష్, జనగం మోహన్రెడ్డి, బంజ శంకర్ తదితరులు పాల్గొన్నారు.