నిజాంసాగర్/పిట్లం/మద్నూర్/బిచ్కుంద, ఆగస్టు14: ఎమ్మెల్యే షిండే పుట్టిన రోజు వేడుకలను నియోజకవర్గంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం హైదరాబాద్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే బర్త్డే వేడుకలను జరుపుకొన్నారు. నిజాంసాగర్లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నాయకులు సందీప్, రాజు, లింగాగౌడ్, సత్యాగౌడ్తోపాటు స్థానికులు, గోర్గల్ గ్రామంలో ఎంపీపీ పట్లోల్ల జ్యోతీదుర్గారెడ్డి, బీసీ వసతి గృహంలో వార్డెన్ కిషన్కుమార్, అంజనాద్రి ఆలయంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు కేక్ కట్ చేశారు. నాయకులు దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, విఠల్, రమేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దకొడప్గల్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే షిండే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే హన్మంత్షిండే, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డిని అభిమానులు భారీ గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. జుక్కల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ యశోద నీలూపటేల్, నాయకులు సాయాగౌడ్, మాధవ్రావు దేశాయ్, శివానంద్, గంగాధర్ పాల్గొన్నారు.
పిట్లం సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద 56 కేజీల కేక్ను కట్ చేశారు. సర్పంచుల సంఘం సభ్యులు గజమాలతో సత్కరించారు. ఎంపీపీ కవితా విజయ్, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మీ శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీబాయి బాబూసింగ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అన్నారం వెంకట్రాంరెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, నాయకులు ప్రతాప్రెడ్డి, కుమ్మరి రాములు, నర్సాగౌడ్, జగదీశ్, రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు.
మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. పెద్ద ఎక్లారా గురుకుల పాఠశాల, మైథిలీ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. ఎంపీపీ లక్ష్మీబాయి, డీసీసీబీ డైరక్టర్ రాంపటేల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, సొసైటీ చైర్మన్ శ్రీనుపటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయాగౌడ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు దరాస్ సురేశ్, గఫార్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దీన్దయాళ్, వైస్ ఎంపీపీ జైపాల్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గంగాధర్, నాయకులు అశోక్పటేల్, బాబూపటేల్, బస్వరాజ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుందలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. పాఠశాల విద్యార్థులతో పాటు బిచ్కుంద ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ అశోక్ పటేల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రావు, జడ్పీటీసీ భారతీరాజు, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్ పటేల్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బస్వరాజ్ పటేల్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.