కమ్మర్పల్లి, ఆగస్టు 10 : మండలంలోని ఉప్లూర్కు చెందిన బైర రాజేశ్ గుండె ఆపరేషన్ చేసుకోగా, మంత్రి వేముల ప్రశాంత్ర్రెడ్డి రూ.3లక్షల ఎల్వోసీ మంజూరు చేయించారు. ఈ మేరకు టీఆర్ఎస్ నాయకులు బుధవారం ఎల్వోసీ కాపీని అందజేశారు. అదే గ్రామానికి చెందిన డాకూరు శ్రీనివాస్కు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.70వేల ఆర్థిక సహాయం మంజూరుకాగా, నాయకులు ఆయనకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, ఎంపీటీసీ పిప్పెర అనిల్, సీనియర్ నాయకుడు బద్దం చిన్నారెడ్డి, అవారి మురళి, మాసం రాజేశ్వర్గౌడ్, రేణి దశకుమార్, సామ నరేశ్, అవారి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భీమ్గల్, ఆగస్టు 10 : భీమ్గల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చొరవతో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థికసహాయం మంజూరుకాగా, ఎంపీపీ ఆర్మూర్ మహేశ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చౌట్పల్లి రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు ఎంఏ మోయీజ్, సొసైటీ చైర్మన్ శివసాయి నర్సయ్య, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ శర్మానాయక్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.