సిరికొండ, ఆగస్టు 4 : సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆర్థికంగా ఆసరాగా నిలస్తున్నాయని ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ అన్నారు. ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సూచన మేరకు మండలంలోని కొండూర్, గడ్కోల్, ముషీర్నగర్, కొండాపూర్, తూంపల్లి, పాకాల, పందిమడుగు, చీమన్పల్లి, తాటిపల్లి గ్రామాల్లో మొత్తం 66 మంది లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి ఆయన కల్యాణలక్ష్మి చెక్కులను గురువారం అందజేశారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు మలావత్ మాన్సింగ్, ఎంపీపీ మలావత్ సంగీతారాజేందర్, వైస్ ఎంపీపీ తోట రాజన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారవోయిన శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ మైలారం గంగారెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఆకుల తిర్మల్, సర్పంచులు క్యాతం పద్మా శివారెడ్డి, నర్సారెడ్డి, దేవాగౌడ్, రమేశ్, లక్ష్మీ తిరుపతి, కీరీబాయి, తిరుపతి, ఇజాప లక్ష్మి, నర్సయ్య, నాయకులు నర్సారెడ్డి, గడీల శ్రీనివాస్, మలావత్ మహేందర్, సురేందర్, నరేశ్, సంతోష్రెడ్డి, చిగురు శ్రీనివాస్, ఆదిత్య, రాజు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.