మెండోరా, జూలై 24 : మెండోరా మండల కాంగ్రెస్ మైనారిటీ సెల్, యూత్ నాయకులు మంత్రి ప్రశాంత్రెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. మైనారిటీ నాయకుడు షేక్ హఫీజ్ మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్రెడ్డి చేపడుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగంపేట్ శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో హనీఫ్, ఎండీ ఇర్ఫాన్, షేక్ ముజాహిద్, ఎస్కే జావిద్, అబ్దుల్ కరీం, ఎండీ సలీం, ఎండీ రఫీక్, ఎండీ సాజిద్, షేక్ మాజిద్, నవాబ్ హుస్సేన్, ఎస్కే అస్రాలన్, సయ్యద్ షాబాజ్, ఎండీ ఆయాతో పాటు మొత్తం 45 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ మిస్బా, ఉపసర్పంచ్ సంపంగి సతీశ్, ఎంపీటీసీ జాన్బాబు, ఆలయ కమిటీ చైర్మన్లు విద్యాసాగర్రెడ్డి, అనిల్బాబు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు, ఎస్కే పాషా, నవీన్గౌడ్, ప్రమోద్, భాస్కర్గౌడ్, అర్జున్, తోకల కిశోర్, భాస్కర్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్కేవీలోకి విద్యుత్ శాఖ కార్మికులు
ఎస్సారెస్పీ జల విద్యుదుత్పత్తి కేంద్రంలోని సివిల్ విభాగం కార్మికులు 11 మంది రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్కేవీలో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘంలోకి ఆహ్వానించారు. ఉద్యోగ భద్రతను కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, అందుకే టీఆర్ఎస్ కేవీలో చేరామని కార్మికులు ప్రకటించారు. శ్రీనివాస్రావు, సుమలత, సంతోష్, రాజేశ్వర్, గంగాధర్, వెంకటేశ్, రాజు, నరేశ్, రాజమణి, జ్యోతి, అహ్మదీ బేగం, ఈశ్వరమ్మ, నాయకులు పాల్గొన్నారు.