ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు, కాంగ్రెస్కు చెందిన నలుగురు శాసనసభ్యులు పదవీ ప్రమాణం చేశారు. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారు.
కమ్మర్పల్లి/బాన్సువాడ/ నిజాంసాగర్/ఎల్లారెడ్డి/ డిచ్పల్లి, డిసెంబర్ 9: తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరింది. శనివారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా.. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. బాన్సువాడ, బాల్కొండ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి ప్రమాణం చేశారు.
కాంగ్రెస్ నుంచి..
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎల్లారెడ్డి, జుక్కల్, బోధన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, తోట లక్ష్మీకాంతారావు, ప్రొద్దుటూరి సుదర్శన్రెడ్డి, రేకులపల్లి భూపతిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్యేలకు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో బీజేపీ నుంచి గెలిచిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి (కామారెడ్డి), పైడి రాకేశ్రెడ్డి (ఆర్మూర్), ధన్పాల్ సూర్యనారాయణగుప్తా (నిజామాబాద్ అర్బన్) అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు.