విద్యానగర్, జనవరి 17 : జిల్లా కేంద్రం లో ఈ నెల 25వ తేదీన నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలకు సీనియర్ సిటిజన్ ఫోరం, దివ్యాంగుల సంఘం ప్రతినిధులను ఆహ్వానించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలపై అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అన్నారు. ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పారు. డివిజన్ కేంద్రాల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు నిర్వహించాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా యువజన, క్రీడల అధికారి దామోదర్ రెడ్డి, ఆర్డీవోలు శ్రీనివాస్రెడ్డి, శ్రీను, జిల్లా ఎన్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగరావు, కామారెడ్డి డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ చంద్రకాంత్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అభినందన
జాతీయ స్థాయి సౌత్ జోన్ సీనియర్ బాలికల షూటింగ్ బాల్ పోటీల్లో గాంధారి మండలం పోతంగల్ గ్రామానికి చెందిన ప్రణీత, సింధు బంగారు పతకాలను సాధించారు. సీనియర్ బాలుర విభాగంలో అభిలాష్రెడ్డి ద్వితీయ స్థానం పొందారు. జూనియర్ విభాగంలో సాయి కృష్ణ ద్వితీయ స్థానంలో నిలిచారు.
జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ కార్యాలయంలోని ఆయన చాంబర్లో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మంగళవారం అభినందించారు. షూటింగ్ బాల్ గురించి కోచ్ లక్ష్మణ్ రాథోడ్ కలెక్టర్కు వివరించాడు. కార్యక్రమంలో షూటింగ్ బాల్ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, గాంధారి జడ్పీటీసీ సభ్యుడు శంకర్ నాయక్, సర్పంచ్ సంజీవ్, జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్ రెడ్డి, డీఈవో రాజు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి సాయిలు, పేట సంఘం జిల్లా అధ్యక్షుడు రంగ వెంకటేశ్వర్ గౌడ్, కార్యదర్శి నోముల మధుసూదన్రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
క్యాలెండర్ను ఆవిష్కరించిన కలెక్టర్
గంగపుత్ర ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 2023 నూతన క్యాలెండర్ను కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు రాజన్న, అధ్యక్షుడు వెంకట్, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, కోశాధికారి రాము, అసోసియేషన్ సభ్యులు పోశన్న, కిశోర్, బాలరాజ్, ఎల్లేశ్, ప్రవీణ్, నరేశ్, రమేశ్, గంగారాం, చందర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.