ఖలీల్వాడి, మార్చి 22: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ షోను జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ప్రారంభించారు. ప్రాపర్టీ షోలో నిజామాబాద్, హైదరాబాద్కు చెందిన నిర్మాణ రంగ కంపెనీలు పాల్గొనగా.. 23 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ స్టాళ్లను ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులు సందర్శించి ఆయా నిర్మాణ రంగ ప్రాజెక్టులను ఆసక్తిగా అడిగి తెలుసుకొన్నారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ప్రకటనల విభాగం జనరల్ మేనేజర్ ఎన్.సురేందర్ రావు, యూబీఐ రీజినల్ హెడ్ శంకర్ ఎబ్రామ్, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ ఎం. శ్రీకాంత్, ‘నమస్తే’ బ్రాంచ్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, బ్యూరో చీఫ్ జూపల్లి రమేశ్, ప్రకటనల విభాగం మేనేజర్ కడారి శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
సొంతింటి కలను సాకారం చేయడానికే నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో ఏర్పాటు చేశారని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. హైదరాబాద్, నిజామాబాద్కు చెందిన బిల్డర్స్, రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు ఇండ్లు, అపార్ట్మెంట్కు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకునేలా ఒకే వేదికపై ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కొనుగోలుదారులకు ఈఎంఐ పద్ధతిలో రుణ సదుపాయం కల్పించడానికి బ్యాంకర్లు ప్రత్యేక స్టాళ్లను ఏర్పా టు చేశారన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎన్.సురేందర్ రావు, జనరల్ మేనేజర్, నమస్తే తెలంగాణ ప్రకటనల విభాగం ప్రాపర్టీషోలో అన్ని ప్రభుత్వ శా ఖల నుంచి అనుమతులు తీసుకున్న సంస్థలు మాత్రమే ప్రదర్శనకు అనుమతించినట్లు నమస్తే తెలంగాణ ప్రకటన విభాగం జనరల్ మేనేజర్ సురేందర్రావు తెలిపారు. ఓపెన్ ప్లాట్స్, విల్లాలు, అపార్ట్మెంట్లు విక్రయించే సంస్థలన్నీ ఉన్నాయన్నారు. రూ. 20 లక్షల నుంచి ఓపెన్ ప్లాట్స్, రూ. 3 కోట్ల విల్లాల వరకు ఇక్కడ ప్రదన్శన ద్వారా కొనుగోలు చేయవచ్చన్నారు. ఇదే వేదికపై ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయ బ్యాంకులు తక్షణమే రుణ సదుపాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
గృహ, వాణిజ్య, వాహనాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సులభంగా రుణాలు అందిస్తున్నట్లు ఎస్బీఐ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు. తక్కువ వడ్డీతోనే మెరుగైన సేవలను వినియోగదారులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రాపర్టీ షో ద్వారా స్థిరాస్తిని కొనుగోలు చేసే వారికి సులభంగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ తరహాలో జరిగే కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడం బాగుందన్నారు.
మూడేండ్లుగా నిజామాబాద్ వేదికగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉంటున్నాయని యూబీఐ రీజినల్ హెడ్ శంకర్ ఎబ్రామ్ అన్నారు. . మొన్ననే ఆటో షో ద్వారా జనాలకు చేరువయ్యామని, ఇప్పుడు ప్రాపర్టీ షోతో మరోసారి ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి ప్రయత్నాల ద్వారా నగరవాసులకు ఎంతో మేలు చేకూర్చినట్లు అవుతుందన్నారు. ఇందులో తాము కూడా భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
28 ఎకరాల్లో మేడ్చల్ వద్ద హెచ్ఎండీఏ, ఆర్ఈఏఆర్ అప్రూవల్తో 22 వేల చ.అడుగుల వెంచర్ అందుబాటులోకి తెచ్చాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ తదితర అన్ని మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేశాం. విల్లాస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే 70 శాతం విక్రయించాం. 30 శాతం మాత్రమే అందుబాటులో ఉంది.
చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లో అతి తక్కువ ధరలకే అపార్ట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 48లక్షల నుంచి రూ.5.5 కోట్ల వరకు ఉన్నది.
కొంపల్లిలో మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేవిధంగా 2 బీహెచ్కే రూ. 55 లక్షలు, 3 బీహెచ్కే రూ.65 లక్షల్లో ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చాం. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
కొంపల్లి, గుండ్ల పోచమ్మ వద్ద 2బీహెచ్కే , 3 బీహెచ్కేతోపాటు 4, 5 బీహెచ్కేతో ఫ్లాట్స్ అందు బాటు లో ఉన్నాయి. ప్రారంభ ధర రూ. 60 లక్షల నుంచి రూ.1.3 కోట్ల వరకు ఉంది. విశాలమైన, అంద మైన అపార్ట్మెంట్లు ఉన్నాయి.
కొంపల్లిలో నిజామాబాద్ హైవే నుంచి సినీ ప్లానెట్ పక్కన 1.3 కిలోమీటర్ల దూరంలో అపార్ట్మెం ట్లు అందుబాటులోకి తెస్తున్నాం. 3. 1 ఎకరాల్లో 4 బ్లాక్లు, క్లబ్హెడ్, 2, 3 బీహెచ్కేతో మొత్తం 316 ఫ్లాట్స్ నిర్మిస్తున్నాం. వీటి ధర చ.అడుగుకు రూ. 5500 ఉండ గా, ప్రస్తుతం ప్రాపర్టీషోలో ప్రత్యేక ఆఫర్ కింద రూ. 4900కే ఇస్తున్నాం.
మా సంస్థ ద్వారా 9 ప్రాజెక్ట్లను కస్టమర్లకు తక్కువ ధరలకు అందుబాటులో తెచ్చాం. దూలపల్లి, గుండ్ల పోచంపల్లి, మేడ్చల్లో ఉన్నాయి. రూ. 2 బీహెచ్కే రూ. 60లక్షలు, 3 బీహెచ్కే రూ. కోటి వరకు వీటి ధర ఉన్నది.
అపర్ణ కన్స్ట్రక్షన్స్ ద్వారా 15 ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. 4 వెంచర్లు, 11 అపార్ట్మెంట్లు ఉన్నాయి. మేడ్చల్, చేవెళ్ల, కొంపల్లి పరిసరాల్లో అపార్ట్మెంట్లు అందు బాటులో ఉన్నాయి. రూ. 83లక్షల నుంచి రూ. 8.5 కోట్ల ధర పలుకుతున్నాయి.
మా సంస్థ ద్వారా 7 ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. వాణిజ్య సముదాయానికి సంబంధించి ఒక్క బిల్డింగ్లో పది అంతస్తులు ఉన్నాయి. 7, 8 ఫోర్లతో 2లక్షల చదరపు అడుగులు, 4 సెల్లార్స్, 18 లిఫ్ట్లు, 1410 కార్ల పార్కింగ్ సదుపాయం ఉంది. 7 ప్రాజెక్ట్లు 52 లక్షల చ.అడుగులతో అందుబాటులో ఉన్నాయి. రెండు మినీ థియేటర్లు ఉన్నాయి. మీ పెట్టుబడికి కచ్చితమైన రిటర్న్స్ వస్తాయి.
కొంపల్లిలో ఎన్హెచ్-44ను ఆనుకొని మధ్య తరగతికి కుటుం బాలకు అపార్ట్మెంట్లను అందు బాటులోకి తెచ్చాం. 1935 చ.అడుగుల నుంచి 3425 చ. అడుగుల వరకు ఫ్లాట్లు ఉన్నాయి.
కొంపల్లిలో మా సంస్థ నాలుగు ప్రాజెక్టులను నిర్వహిస్తున్నది. సామాన్యుడికి అందుబాటులో ఈ అపార్ట్మెంట్లు ఉన్నాయి. వీటి ధర రూ. 48 లక్షల నుంచి రూ. కోటిన్నర వరకు ఉన్నది.
14 ఏండ్లుగా ఇండిస్ ద్వారా 6 ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చాం. మధ్య తరగతివారికి ధరలు అందుబాటులో ఉన్నాయి. టీసీపీఏ జంక్షన్, కూకట్పల్లి, బొల్లారం, కొండాపూర్, దుబ్బపల్లిలో అపార్ట్మెంట్లు ఉన్నాయి. వీటి ధర రూ. 56 లక్షల నుంచి రూ. 3.5 కోట్ల వరకు ఉన్నది.
మా సంస్థ ద్వారా సామాన్యులకు అందుబాటులో అపార్ట్మెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. గుండ్ల పోచంపల్లి వద్ద రూ.60 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు, గండిమైసమ్మ వద్ద రూ. 65 లక్షల నుంచి రూ. 90లక్షల వరకు ధర ఉన్నది.