అత్యున్నత సాంకేతిక ప్రమాణాలకు మరో పేరుగా నిలిచిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లో లక్షల్లో జీతాలు పొందుతూ అత్యున్నత స్థాయిలో ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగానికి తలమానికంగా శాస్త్ర, సాంకేతిక వైజ్ఞానిక కేంద్రంగా కేల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్లో బీటెక్తో పాటు సుమారు 50 స్పెషలైజేషన్ కలిగిన సీఎస్ఈ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్, సీఎస్ఐటీ, ఈసీఎస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఈఈఈ, మెకానికల్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీలాంటి ఎన్నో కోర్సులతో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతోంది. ఈ యూనివర్సిటీలో చదివినవారు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేస్తూ లక్షల రూపాయల వేతనాలతో పేరు తెచ్చుకుంటున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంజినీరింగ్ నైపుణ్యాలతో పాటు విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఘనత ఈ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీకే దక్కుతుంది. విద్యార్థులకు ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న ఉన్నత విద్యావకాశాలపై అవగాహన కల్పించడంతోపాటు విద్యార్థులు ఎలా చదవాలి.. ఎలాంటి నైపుణ్యాలు అలవర్చుకోవాలి తదితర అంశాలపై బోధన్ పట్టణంలోని శ్రీ విజయసాయి జూనియర్ కళాశాల క్యాంపస్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ – కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘లక్ష్యం – 2023’ పేరిట శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా ఇంజినీరింగ్ విద్యకు సంబంధించి తామెంతో నేర్చుకున్నామంటూ హర్షం వ్యక్తంచేశారు. సదస్సులో పలువురు విద్యార్థులు తమ సందేహాలను నివృత్తిచేసుకున్నారు. సదస్సు ముగింపులో నిర్వహించిన లక్కీ డ్రాలో ఎంపికైన శృతి, మోక్షిత్కు బహుమతులను అందజేశారు. కార్యక్రమం ప్రారంభంలో శ్రీ విజయసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన బృంద నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అవగాహన సదస్సులో నమస్తే తెలంగాణ నిజామాబాద్ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, ప్రకటనల విభాగం మేనేజర్ కె.శ్రీకాంత్, బోధన్ ఆర్సీ ఇన్చార్జి సాగిరాజు బలరామరాజు, కేఎల్ డీమ్డ్ యూనిర్సిటీ ప్రతినిధి రాజేశ్, శ్రీ విజయసాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ బి.సుబ్బారావు, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థికి ఇంటర్ చదువు కీలకం. జీవితంలో ఏ రంగంలో స్థిరపడాలన్నా సింహభాగం ఇక్కడే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ తర్వాత ఏం చదవాలి.. ఎలాంటి కోర్సులు చేయాలి.. ఏం చదివితే ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి తదితర అంశాలపై అందరికీ సరైన అవగాహన ఉండదు. కొందరు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను బాగా చదివించాలని ఉన్నా ఎలాంటి కోర్సులు చదివించాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో ఇంటర్ తర్వాత ఉజ్వల భవిష్యత్తుకు తీసుకెళ్లే కోర్సులు, అవి చదివితే ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి.. నైపుణ్యం ఎలా సాధించాలి తదితర అంశాలపై బోధన్ పట్టణంలోని శ్రీ విజయసాయి జూనియర్ కళాశాల క్యాంపస్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ – కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘లక్ష్యం – 2023’ పేరిట శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
-బోధన్, డిసెంబర్ 23
ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించిలక్షలాది రూపాయల వేతనాలతో జీవితంలో స్థిరపడాలంటే సర్టిఫైడ్ ఇంజినీర్లుగా మిగిలిపోరాదని, సరైన మార్గంలో కష్టపడి చదివి క్వాలిఫైడ్ ఇంజినీర్లు కావాలని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ (అడ్మిషన్స్) డాక్టర్ జె.శ్రీనివాస్రావు అన్నారు. అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అనేక మంది విద్యార్థులు పొరుగు రాష్ర్టాల్లో ఏదో చదివామంటే చదివామన్నట్లుగా ఇంజినీరింగ్ విద్యను అభ్యసించి, ఎటువంటి నైపుణ్యాలు సాధించకుండానే డిగ్రీలు పొందుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా డిగ్రీలు పొందినవారు సర్టిఫైడ్ ఇంజినీర్లుగా మిగిలిపోతున్నారని చెప్పారు.
ఈ సర్టిఫైడ్ ఇంజినీర్లు తక్కువ వేతనాలు, ఆర్థిక ఇబ్బందులతో జీవితాలను గడుపుతున్నారని, ఇలా కాకుండా ఇంజినీరింగ్ విద్యకు సరైన వర్సిటీ లేదా కళాశాలను ఎంపికచేసుకుని, కష్టపడి చదివితే క్వాలిఫైడ్ ఇంజినీర్లు అవుతారని సూచించారు. క్వాలిఫైడ్ ఇంజినీర్లను తమ కేఎల్ యూనివర్సిటీ తయారుచేస్తున్నదని తెలిపారు. కేఎల్ యూనివర్సిటీలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఉంటుందని, తరగతి గదుల్లో ల్యాప్ట్యాప్లతో ప్రవేశించి నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. మొబైల్ ఫోన్లు జామర్లతో పనిచేయవని తెలిపారు. అక్కడ లెక్చరర్ పాఠం ల్యాప్టాప్లో చూసిన తర్వాత విద్యార్థులే స్వయంగా రకరకాలుగా విశ్లేషించి సొంతంగా రాసే ప్రావీణ్యాన్ని సాధిస్తారని, దీంతో పరీక్షలంటే అసలు భయపడరని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తామన్నారు.
కష్టపడి చదివే విద్యార్థులకు డబ్బు ఒక అవరోదంగా ఉండదని, స్కాలర్షిప్లతో పాటు ‘విద్యాలక్ష్మి’ పోర్టల్ ద్వారా విద్యారుణాలను పొందవచ్చన్నారు. తమ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదివేవారిలో పొరుగుదేశాలకు వెళ్లేవారు తప్ప ఇక్కడే ఉండే 90 శాతం మంది మూడేండ్ల పాటు మాత్రమే క్యాంపస్లో చదువుతారని, నాల్గో సంవత్సరం కంపెనీల్లో పనిచేస్తూ ఇంజినీరింగ్ పూర్తిచేస్తారన్నారు. కొత్త విద్యావిధానం ప్రకారం ఇంజినీరింగ్ రెగ్యులర్గా అభ్యసించే విద్యార్థులు మూడేండ్ల కామర్స్ లేదా మరో డిగ్రీని అభ్యసించే అవకాశాన్ని కల్పించినట్లు చెప్పారు.యూజీసీ కేటగిరి-1లో ఉన్న కేఎల్ యూనివర్సిటీలో బైపీసీ విద్యార్థులు సైతం ఇంజినీరింగ్ కోర్సులను అభ్యసించే అవకాశముందని డాక్టర్ శ్రీనివాస్రావు తెలిపారు.
-జె.శ్రీనివాస్రావు, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ (అడ్మిషన్స్)
ఇంటర్ ఎంతో కీలకం
విద్యార్థులకు ఇంటర్ దశ ఎంతో కీలకమైంది. ఈ దశలో భవిష్యత్తుకు సంబంధించి చక్కటి మార్గాన్ని ఎంచుకోవాలి. విద్యార్థి ఎక్కడ, ఏ పరిసరాల్లో చదివాడన్న దానిపైనే అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ దశలో విద్యార్థి ప్రావీణ్యాన్ని ఇంజినీరింగ్లో చదివేందుకు చక్కటి క్యాంపస్ను ఎంపికచేసుకోవాలి. కేఎల్ యూనివర్సిటీలో క్రమశిక్షణ, నైపుణ్యాలతో కూడిన విద్యను విద్యార్థులు నేర్చుకుంటారు.
డాక్టర్ షణ్ముఖరావు, ప్రొఫెసర్, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ
ఎంతో ఉపయోగపడింది
నమస్తే తెలంగాణ, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సు మా విద్యార్థులు ఎంతో నేర్చుకున్నారు. ఇంజినీరింగ్ విద్యలో వచ్చిన మార్పులు, ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ విద్యకు ఉన్న అవకాశాలను విడమర్చి చెప్పారు. ఈ సదస్సుతో ఇప్పటివరకు తెలియని అనేక అంశాలను నేర్చుకున్నామని విద్యార్థులు అంటున్నారు.
-బి.సుబ్బారావు, శ్రీ విజయసాయి జూనియర్ కళాశాల డైరెక్టర్
రెండో కోర్సు గురించి తెలిసింది
మా కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో కొత్త విషయం తెలిసింది. యూజీసీ గుర్తింపు పొందిన వర్సిటీల ద్వారా బైపీసీతో కేవలం మెడిసిన్ కాకుండా ఇంజినీరింగ్ కూడా చేయవచ్చనే విషయం తెలిసింది. ఈ సదస్సుతో ఉన్నత విద్యాభ్యాసంపై ఉన్న భయం పోయింది. ఈ సదస్సు ఎంతో స్ఫూర్తినిచ్చింది. నేను రాబోయే రోజుల్లో మెడిసిన్ లేదా ఇంజినీరింగ్ చేద్దామని అనుకుంటున్న.
-బి. సీమ, బైపీసీ, సెకండియర్
ఉన్నత విద్యపై భయం పోయింది
ఇంటర్ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం చేసి సివిల్స్కు ప్రిపేర్ అవుతా. నా సంపాదనతోనే ఉద్యోగం సాధించాలనే నాకు ఈ సదస్సుతో ధీమా కలిగింది. సదస్సులో ఇంటర్ అనంతరం ఉన్నత విద్య పై మార్గదర్శకాలను చక్కగా వివరించారు. ఈ అవగాహన కల్పించిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ, నమస్తే తెలంగాణ, మా కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు.
– ఓంకార్, బైపీసీ, సెకండియర్, బోధన్
అవకాశాలపై అవగాహన వచ్చింది
ఉన్నత విద్యాభ్యాసానికి డబ్బులు అవసరం లేదని, గమ్యం, లక్ష్య సాధనతో చదివితే ఉన్నత విద్య చదివేందుకు అవసరమైతే విదేశాల్లో సైతం అవకాశాలు వస్తాయని తెలిసింది. దేశంలో యూనివర్సిటీల గుర్తింపుతో పాటు నాణ్యమైన సర్టిఫైడ్, క్వాలిఫైడ్ విద్యాభ్యాసం గురించి తెలుసుకున్న. రాబోయే రోజుల్లో బీడీఎస్ లేదా బీఫార్మసీ చేద్దామనుకుంటున్న.
– ఎస్. శృతి, బైపీసీ, సెకండియర్, ఎల్లారెడ్డి