Appointed | కంటేశ్వర్, జూన్ 6 : రెడ్డి సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీ లో వరుసగా మూడోసారి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఈ విధంగా అయితే రెడ్ల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం సాగించామని, ఇప్పుడు కూడా తనవంతుగా ఎల్లప్పుడూ రెడ్ల సంక్షేమం కోసం రెడ్డి నిరుద్యోగ యువతీ యువతుల కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాడుతామని చెప్పారు.
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వంపై నిరంతరం పోరాడుతామని ఈ సందర్భంగా అన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ యొక్క పదవి బాధ్యతను అప్పగించిన వ్యవస్థాపక అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు నాగర్త చంద్రారెడ్డి ప్రధాన కార్యదర్శి సందీప్ తిరుపతిరెడ్డి సహాధ్యక్షులు నాగిరెడ్డి లింగారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ సుమన్ రెడ్డి బండ గోపాల్ రెడ్డి రాజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.