Sirikonda | సిరికొండ, జూన్ 12 : ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి రక్షణ పొంది సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని సిరికొండ ఎస్సై రామకృష్ణ పిలుపునిచ్చారు. సిరికొండ మండలంలోని చిమన్ పల్లి గ్రామంలో శుక్రవారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలపై సురక్షితంగా ప్రయాణించేందుకు ప్రతి వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
చాలామంది వాహనదారులు హెల్మెట్ ధరించలేక ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై చివరి నిమిషంలో చికిత్స అందగా మృతి చెందారని పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని, ఇచ్చినచో వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అపరిచిత వ్యక్తులకు ఎవరికి ఓటీపీలు చెప్పదని, ఖాతాల్లో డబ్బులు ఖాళీ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కళ్లెం నర్సయ్య, ఉప సర్పంచ్ ఏనుగు రాజేందర్, కార్యదర్శి అన్వేష్, సురని రాజు, మిల్క్ మహేష్, అల్మాల నరేష్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.