గాంధారి, మార్చి 5: బోధన్ పట్టణంలోని బీసీ హాస్టల్లో హత్యకుగురైన గాంధారి మండలం తిప్పారం తండాకు చెందిన డిగ్రీ విద్యార్థి హరియాల వెంకట్ కుటుంబసభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్తో కలిసి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకట్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి, న్యాయం జరిగేలా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, గాంధారి జడ్పీటీసీ శంకర్నాయక్, బీఆర్ఎస్ నాయకులు తానాజీరావు, మమ్మాయి సంజీవ్ తదితరులు ఉన్నారు.