ఇప్పటికే ఒకసారి బొందలవడి 60ఏండ్లు ఆగమైనం, ఆ పంచాయితీ తెంచుకొని ఇప్పుడిప్పుడే గట్టునవడుతున్నం.. ఇట్లాంటి తరుణంలో మాయమాటలు నమ్మితే మళ్లీ గోసపడతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నయి, మాయమాటలు చెబుతూ ఓట్లు వేయమని వస్తున్నరు, ఇప్పుడు ఆగం కావొద్దని ప్రజలను కోరారు. మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ సురేశ్రెడ్డితో కలిసి కమ్మర్పల్లి మండలంలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత, శాంతి భద్రతలు ఇచ్చే నాయకుడు కేసీఆర్ ఉన్నాడు కాబట్టే తెలంగాణలోని మారుమూల పల్లెలోనూ అభివృద్ధి వెలుగులు విరబూస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయని ఎద్దేవా చేశారు.
-కమ్మర్పల్లి/మోర్తాడ్, ఆగస్టు 28
కమ్మర్పల్లి/ మోర్తాడ్, ఆగస్టు 28:ఇప్పటికే ఒకసారి బొందలవడి 60ఏండ్లు ఆగమైనం, ఆ పంచాయితీ తెంచుకొని ఇప్పుడిప్పుడే గట్టునవడుతున్నం… కావున గట్టి నాయకుడు, దక్షత ఉన్న నాయకుడు, పట్టుదల ఉన్న నాయకుడు ఉంటే అభివృద్ధి గ్రామం వరకూ వస్తుందని ప్రజలు ఆలోచించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నయి, మాయమాటలు చెబుతూ ఓట్లు వేయమని వస్తున్నరు, ఇప్పుడు ఆగం కావొద్దని ప్రజలను కోరారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి, కమ్మర్పల్లి, నాగాపూర్ గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలకు విచ్చేసిన కవిత, అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి మా ట్లాడారు. కర్ణాటకలో నిన్నగాక మొన్న ప్రజలు కాంగ్రెస్కు ఓటేసిండ్రు, గెలిపించిండ్రు. సరిగ్గా నెల తిరగకముందే అక్కడి ముఖ్యమంత్రి చేతులెత్తేసిండు, పైసలెల్తలేవు నేను చేసిన వాగ్ధానాలు అమలు చేసే పరిస్థితి లేదని చెప్తుండని, చేసిన వాగ్ధ్దానాలను నెరవేర్చకపోతే, రా ష్ర్టాన్ని ఆర్థికంగా బలం చేయకపోతే అధికారంలోకి ఎందుకురావాలని ప్రశ్నించారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పరిస్థితి అదేనని, ప్రజలు వారిని నమ్మి మోసపోవద్దని అన్నారు. బాల్కొండలో కాంగ్రెస్ నుంచి సునీల్రెడ్డి వస్తే ఆ పార్టీ ముఖ్యమంత్రి ఎవరో అడగాలని సూచించారు. మనిషి మంచోడైతే సరిపోదు, అతను ఉన్న పార్టీ మంచిది కావాలని అన్నారు.
రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత, శాంతిభద్రతలు ఇచ్చే నాయకుడు, పట్టుదల ఉన్న నాయకుడు, గట్టి నాయకుడు కేసీఆర్ మన రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే మారుమూల గ్రా మాల్లో సైతం అభివృద్ధి వెలుగులు విరబూస్తున్నాయని అన్నారు. గట్టి నాయకుడు కేసీఆర్కు సైనికుడిలాంటి వ్యక్తి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కాబట్టే బాల్కొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి పథాన నడుస్తున్నదని, ప్రశాంతన్నకు మీరు వేసే ప్రతి ఓటూ కేసీఆర్కు బలాన్ని చేకూరుస్తుందని చెప్పారు. బీఆర్ఎస్కు సీఎం అభ్యర్థి కేసీఆర్ ఉన్నాడని ఘంటాపథంగా చెప్పగలుగుతాం, కానీ కాంగ్రెస్కు ఎవరనేది తేలని పరిస్థితి. కాంగ్రెస్ మంచి పార్టీ కా దు, సురేశ్రెడ్డి స్పీకర్గా ఉన్నప్పుడు కొట్లాడి చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతలకు రూ.18 కోట్లు తీసుకురాగలిగాడు, కానీ మనకు వారేమీ ఇవ్వలె, ఇవ్వాలని మనసున్న పార్టీకాదని అన్నారు. గట్టి నాయకుడు కేసీఆర్ కాబట్టే వరదకాలువలో కాళేశ్వరం జలాలు ఎదురేగి ఎస్సారెస్పీకి చేరుకున్నాయి. నియ్యత్ జైసా హై బర్కత్ వైసా హై అంటరు మన సీఎం.. నియ్యత్గా అన్నివర్గాలకు సంక్షేమాన్ని అందించాలని ఆలోచిస్తున్నాడు కాబట్టే మన రాష్ర్టానికి పదేండ్ల నుంచి బర్కత్ ఉన్నదని అన్నారు. వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని, హైదరాబాద్కు కంపెనీలు రావడంతో రాష్ట్రం ఆర్థికంగా బలపడుతున్నదని, దీనివల్లే అన్ని సంక్షేమ ఫలాలు అందించగలుగుతున్నామన్నారు. మోర్తాడ్ కేంద్రంగా మంత్రి ప్రశాంత్రెడ్డితో కలిసి బీడీకార్మికుల పింఛన్ ఇవ్వాలని సీఎం ను కోరడంతో వెంటనే మంజూ రు చేశారని, ఇంకారాని వారు ఉన్నా, వచ్చి బందయిన వారు ఉన్నా వాటిని పరిశీలించి అందరికీ వచ్చేలా చూస్తామన్నారు. బీజేపీ గురించి మా ట్లాడే అవసరమే లేదని, వారు అధికారంలోకి వచ్చే ది లేదు, పొయ్యేదిలేదని అన్నారు.
తెలంగాణపై కేంద్రప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో తొమ్మిదేండ్ల పాలనలో గ్రామాల్లో మార్పు సుస్పష్టంగా కనిపిస్తున్నదని దేవాదాయ,అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. 75ఏండ్ల పాలనల్లో కాంగ్రెస్, బీజేపీలు గ్రామాల్లోని సమస్యలను ఎందుకు దూరం చేయలేకపోయాయో ప్రజలు ఆలోచించాలన్నారు. నిర్మల్ జిల్లాను ఆనుకొని ఉన్న మహారాష్ట్ర గ్రామాలైన కీనీ, అప్పారావుపేట గ్రామాల్లో పింఛన్ రూ.600, 6గంటల కరెంటు మాత్రమే వస్తున్నదని చెప్తున్నారని, తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలను చూసి వారి గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తాననగానే ఆయన చేసిన అభివృద్ధిని చూసి గ్రామాలకు గ్రామాలు కారుగుర్తుకు ఓటేస్తామని తీర్మానాలు చేసుకుంటున్నాయని, ఇక్కడ ప్రశాంత్రెడ్డి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, గ్రామాలు తీర్మానాలు చేసి అభివృద్ధి చేసిన వారికి మద్దతు తెలపాలన్నారు. ఒక్క చౌట్పల్లి గ్రామానికే తొమ్మిదేండ్లలో రూ.13కోట్లు ఆసరా పింఛన్ల రూపేనా వచ్చాయంటే రాష్ర్టాన్ని ఆర్థికంగా, సుస్థిరంగా ఉంచేలా చూస్తున్న సీఎంను బలపరచాల్సిన అవసరం ఉన్నదన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణ తొమ్మిదేండ్ల తర్వాత మెరుస్తున్నదని, మెరుస్తున్న తెలంగాణపై అందరికండ్లు పడ్డాయని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి అన్నారు. శరవేగంగా అభివృద్ధి దిశగా పోతున్న తెలంగాణలో మనం కూడా లబ్ధి పొందుదామనే దురాలోచనతో కొందరు ఎన్నికల వేళ వచ్చి నాలుగు మాయమాటలు చెప్తున్నారని, కానీ వాళ్లు వస్తే తెలంగాణ అభివృద్ధి కాదు కదా, ఉన్నది ఊడ్చుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న కేసీఆర్ను మనమందరం బలపరచాల్సిన అవసరం ఉన్నదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు లక్ష్మారెడ్డి, రాజారాం యాదవ్, డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్ రెడ్డి, ఎంపీపీ గౌతమి, జడ్పీటీసీ రాధ, సర్పంచ్ శంకర్, గోపిడి లింగారెడ్డి, చింతశ్రీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సబ్బండవర్గాలకు సంపద చేర్చడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కమ్మర్పల్లిలో జూనియర్ కళాశాలను ప్రారంభించిన అనంతరం 1104 మంది యువత కు లర్నింగ్ లైసెన్సులను మంత్రి వేములతో కలిసి అందజేశారు. అనంతరం నాగాపూర్లో ఆమె మాట్లాడుతూ యాదవులు సీఎంగా ఉన్న రాష్ర్టాల్లో యాదవులకు జీవాలు ఎవరూ ఇవ్వలేదని గుర్తు చేశారు. అది కేసీఆర్ మానవీయ ఆలోచనతోనే సాధ్యపడిందన్నారు. ఉమ్మడి జిల్లాలో మొదట గెలిచే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో ఒక గిరిజన సోదరుడు ఎదుర్కొన్న కష్టాన్ని చూసి కేసీఆర్ రూపొందించిన గొప్ప మానవీయ పథకమే కల్యాణలక్ష్మి అని పేర్కొన్నారు. కులాలు, మతాలతో రాజకీయం చేస్తున్న వాళ్లను నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతులకు వారి భూములపై హక్కు కల్పించే గొప్పది ధరణి అని, ధరణిని వద్దంటున్న వారిని తరిమికొట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. యువత కోసం ఉద్యోగ ప్రకటనలు వేస్తే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్న వారెవరో అందరికీ తెలుసన్నారు. ఎంపీ అర్వింద్ మాట్లాడే మాటలు దారుణమని ఖండించారు. ఎన్నికల్లో సరైన వాళ్లను గెలిపించుకుంటే మన తలరాతను మనమే మార్చుకోగలమని చెప్పారు. రైతు బాంధవుడు కేసీఆర్ కావాల్నా..లేక వ్యవసాయం తెల్వని కాంగ్రెస్, బీజేపీ కావాల్నా అనేది ఆలోచన చేయాలని కోరారు. వచ్చే రాఖీ పండుగ సందర్భంగా మహిళలు తమ సోదరులకు హెల్మెట్ గిఫ్ట్గా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కమ్మర్పల్లి మండల అభివృద్ధికి గడిచిన పదేండ్లలో రూ.440 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.
తొమ్మిదేండ్ల క్రితం తెలంగాణ ఎట్లుండే ఇప్పుడెట్లుంది, ఇక్కడ ఎకరం భూమి ధర అప్పుడెట్ల ఉండే ఇప్పుడెట్ల ఉన్నది, ఎవుసం అప్పుడెట్ల ఉండే ఇప్పుడెట్ల ఉన్నది ఒక్కసారి రైతులు ఆలోచన చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రైతు తల దించుకోవద్దు.. తల ఎత్తుకోవాలని మంకుపట్టుబట్టి రైతు కోసం దేవుడిలా, తండ్రిలా కేసీఆర్ పనిచేయడంతోనే తెలంగాణలో ఈ పరిస్థితి ఏర్పడిందని గుర్తించాలన్నారు. డబ్బులు లేకున్నా రూ.19వేల కోట్ల రుణమాఫీ చేస్తున్న, రూ.73వేల కోట్ల రైతుబంధు డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో జమచేసిన రైతు నాయకుడు కేసీఆర్ గురించి ఒక్కసారి రైతులు ఆలోచించాలని అన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు, అబద్ధాలు చెప్తూ ప్రజలను ఆగం చేస్తున్న బీజేపీ మరోవైపు ఉన్నదని, ప్రజలు ఆలోచించాలన్నారు. పసుపుబోర్డు తెస్తానని అబద్ధాలు చెప్పి మోసం చేసి ఐదేండ్లు గడుస్తున్నా మనకేం చేసింది లేదన్నారు. చౌట్పల్లిలో సోమవారం ఒక్కరోజే రూ.8.25కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకున్నామని, చౌట్పల్లి-రంగారావుపేట డబుల్రోడ్డుకు రూ.7.48కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు, లక్ష్మీనారాయణ ఆలయానికి రూ.50లక్షలు మంజూరు చేసిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి, సొసైటీ గోడౌన్కు రూ.21లక్షలు, గ్రంథాలయానికి రూ.6లక్షలు మంజూరు చేసిన ఎంపీ సురేశ్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు నమ్మితే మళ్లీ ప్రజలకు కష్టాలే పునరావృతమవుతాయని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నాగాపూర్, కమ్మర్పల్లిలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తనపై కొడుకు కన్నా ఎక్కువ ప్రేమ చూపుతున్నారని, ఆ ప్రేమతోనే తన నియోజ కవర్గంలో చిన్న గ్రామాలను సైతం అభివృద్ధి పథంలో నిలుపుతున్నానని చెప్పారు. వరద కాలువ ద్వారా కాళేశ్వరం జలాలను 300 కిలోమీటర్ల దూరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా రప్పించామన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ జలసాధన సభలో ఇచ్చిన మాట మేరకు నీటిని ఎస్సారెస్పీకి తీసుకువచ్చి చూపించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఎదురెక్కిన గోదావరి జలాలను మొదట చూసిన గ్రామం నాగాపూర్ అన్నారు. రేవంత్రెడ్డి ఉచిత కరెంటుపై అవగాహన లేకుండా మాట్లాడుతు న్నాడని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాళ్లు ఇచ్చేది మూడు గంటల కరెంటేనని గుర్తుంచుకోవాలని కోరారు. కమ్మర్పల్లి మండలంలో ప్రభు త్వ జూనియర్ కాలేజీ కల నెరవేర్చామని ఆనందం వ్యక్తంచేశారు. ఇక్కడి యువత కోసం మినీస్టేడియం నిర్మించామని, నియో జకవర్గంలో 10వేల మందికి పైగా యువతకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు అందజేస్తున్నామన్నారు.