సిరికొండ/ఇందల్వాయి, డిసెంబర్ 27 : అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతే ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులను స్వీకరించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీలను ప్రతిఒక్కటీ అమలు చేయాలన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని నర్సింగ్పల్లి గ్రామంలో గల ది లివింగ్ క్రైస్ట్ చర్చిలో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో అన్ని మతాలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటింగ్లో రెండు శాతం మాత్రమే తేడా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.2 వేలు పింఛన్ తీసుకున్న 44 లక్షల మందికి ఎలాంటి దరఖాస్తు తీసుకోకుండా వచ్చే జనవరి 1 నుంచి రూ.4 వేలు ఇవ్వాలన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా రేషన్ కార్డు ఉన్న వారికే ఆరు గ్యారెంటీల సర్వేలో దరఖాస్తులు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మొదట అర్హులందరికీ రేషన్ కార్డు అందించిన తర్వాతే కొత్త పథకాలకు దరఖాస్తులు స్వీకరించాలన్నారు. దరఖాస్తులో నిరుద్యోగ భృతి కాలం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. నిరుద్యోగ భృతి అందించాలన్నారు.
కాంగ్రెస్ చెప్పిన విధంగానే 200 యూనిట్ల కరెంట్ బిల్లు ప్రభుత్వం చెల్లించేలా చూడాలన్నారు. జనవరి నుంచి 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్ కట్టవద్దన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు మాన్సింగ్, సుమనారెడ్డి, ఎంపీపీ సంగీతా రాజేందర్, మాజీ జడ్పీటీసీ అయిత సుజ ఫిలిప్, మాజీ ఎంపీపీ మంజుల, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రమేశ్, రూరల్ జాగృతి కన్వీనర్ మల్లెల సాయిలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ కవితను ఇందల్వాయి మం డల నాయకులు, జడ్పీటీసీ గడ్డం సుమ నా రవిరెడ్డి, బీఆర్ఎస మండల అధ్యక్షులు చిలువేరి దాసు తదితరులు కలిశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కార్యకర్తలు అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలన్నారు. వారి వెంట వైస్ ఎంపీపీ భూసా ని అంజయ్య, నాయకులు పాశంకుమా ర్, ఆరెట్టి రఘు, తేలు విజయ్కుమార్, పులి వసంత, రాజునాయక్, సుధాకర్, చిన్నముత్తెన్న, నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.