వేల్పూర్/ బాన్సువాడ టౌన్/కామారెడ్డి/ ఖలీల్వాడి, మార్చి 3: ఉమ్మడి జిల్లాలో ఆదివారం పల్స్పోలియో కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానలతోపాటు బస్టాం డ్లు తదితర ప్రాంతాల్లో పోలియో కేంద్రాలను ఏర్పా టు చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. బాన్సువాడ మాతాశిశుదవాఖానలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, వేల్పూర్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పల్స్ పోలి యో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు చుక్కల మందు వేసిన అనంతరం వారు మాట్లాడారు.
పిల్లలను పోలియో మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం బాగుంటేనే సమాజం బాగుంటుందని పేర్కొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయిలో పనిచేసిన వైద్యబృందం, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలను అభినందించారు.
పోలియో చుక్కలు వేసుకోలేని పిల్లలు ఎవరైనా ఉంటే ప్రతిఒక్కరిని గుర్తించి, వారికి కూడా పోలియో చుక్కలు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతి నిధులు, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో మొత్తం 1,02,555 చిన్నారులుండగా ఆదివారం 98,646 మందికి పోలియో చుక్కలు వేశారు. పల్స్ పోలియో కార్యక్రమం 96.2శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఐదేండ్లలో పు 1,91,081 పిల్లలు ఉండగా 1,81,781 మందికి పోలియో చుక్కలు వేసినట్లు డీఎంహెచ్వో సుదర్శనం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 95.13శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. మిగిలిన చిన్నారులకు సోమ, మంగళవారం ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బంది చుక్కల మందు వేస్తారని తెలిపారు.