వేల్పూర్, జనవరి 23: నియోజకవర్గానికి చెందిన ఆరుగురు దివ్యాంగులకు మోటరు సైకిళ్లను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మంగళవారం అందజేశారు. నాలుగు రెట్రో ఫిట్టెడ్ మోటర్సైజ్డ్ వాహనాలు, రెండు బ్యాటరీ ఆపరేటర్ వీల్చైర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ చాలా మంది అర్హులైన దివ్యాంగులు ఉన్నారని, వారందరికీ వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు డ్యూటీ చీరెలను పంపిణీ చేశారు. భీమ్గల్ ప్రాజెక్టులో 47 మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించడంతో సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బీమా జమున, ఉపేందర్, వైస్ ఎంపీపీ సురేశ్, జిల్లా ఆర్టీవో మెంబర్ రాములు, సామ మహిపాల్, తహసీల్దార్, ఎంపీడీవో, ఐసీడీఎస్ సీడీపీవో సుధారాణి, ఏసీడీపీవో జ్ఞానేశ్వరి పాల్గొన్నారు.