హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ) : మత్స్యకారుల కుటుంబాలకు తక్షణమే ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అర్హుందరికీ బీమా సౌకర్యం కల్పించాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మ హాసభ అధ్యక్షుడు బండ ప్రకాశ్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని 4,21,767 మందికి ప్రమాదబీమా సౌకర్యం పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన స్వాగతిస్తూ మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు.
బీమా చెల్లింపుల గడువు ముగిసిన తరుణంలో మత్స్యకారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సానుకూల నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.