ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి రూరల్, జూలై 26: కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాబాగౌడ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శిబిరంలో శిక్షణ పొందుతున్న వారికి మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో స్టడీ మెటీరియల్ను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
శిబిరంలోని సుమారు 500మంది ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ, స్టడీ మెరియల్తో పాటు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటుచేసినట్లు చెప్పారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. కోచింగ్ సెంటర్లో ఇస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉద్యోగం సాధించి, తమ కుటుంబాలకు అండగా నిలువాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.