బోధన్ రూరల్, జనవరి16 : క్రీడలతోనే శారీరక, మానసికోల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. సోమవారం సాలూర మండల కేంద్రం లో అల్లె జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాలూర క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. అనంతరం టోర్నమెంట్ నిర్వహిస్తున్న జనార్దన్ను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ, డీసీసీబీ డైరెక్టర్ శరత్, బుయ్యన్ సురేశ్, డిస్కో సాయిలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
నవీపేట, జనవరి16 : మండలంలోని యంచ గోదావరి బ్రిడ్జిపై ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ వెంకటరమణారావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే షకీల్ సోమవారం పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ సంగెం శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వి.నర్సింగ్రావు, నాయకులు న్యాలకంటి అబ్బన్న, బత్తూర్ సాయిలు, బుచ్చన్న, రమేశ్, సంజీవ్రావు, రవీందర్రావు, జనార్దన్ తదితరులు ఉన్నారు.