నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం మహిళలకు తన సొంత డబ్బులతో చీరలు, 20 రకాల వంట వస్తువులతో కూడిన ‘రంజాన్ తోఫా’ల పంపిణీని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ప్రారంభించారు. గురువారం తన నివాసగృహంలో ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమాతో కలిసి రంజాన్ తోఫాలను పేద ముస్లింలకు అందించారు.
నియోజకవర్గంలోని సుమారు పదివేల మందికి ఈ రంజాన్ తోఫాలను అందించనున్నట్లు ఎమ్మెల్యే షకీల్ తెలిపారు.అధికారంలో ఉన్నా లేకపోయినా..గత 20 ఏళ్లుగా రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.