బాన్సువాడ/నిజాంసాగర్, మార్చి 6: నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతుల విజ్ఞప్తి మేరకు రిజర్వాయర్ నుంచి ముందస్తుగా నీటిని విడుదల చేయిస్తున్నట్లు మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి బుధవారం తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆరో విడుత నీటి విడుదల ఈనెల 10వ తేదీ నుంచి ప్రా రంభం కావాల్సి ఉండగా ఎండ తీవ్ర త నేపథ్యంలో పంట పొలాలకు నీటిని విడుదల చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆయకట్టు పరిధిలోని రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. భవిష్యత్తులో మరో విడుత సాగునీరు అవసరముంటే అందుకు తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. గురువారం ఉదయం నుంచి నీటి విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఏఈ శివప్రసాద్ తెలిపారు.